కొటక్ మహింద్రా బ్యాంకుకు ఆర్బీఐ షాక్, రూ.2 కోట్ల జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకు కొటక్ మహీంద్రాకు షాకిచ్చింది. షేర్ హోల్డర్స్ డిటేయిల్స్ సరిగా ఇవ్వనందుకు రూ.2 కోట్ల జరిమానా విధించింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి సరిమైన సమాచారం అందించలేదన్నకారణంగా ఈ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రమోటార్ల వాటాల విలీనానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలను, సూచనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ మేరకు ప్రకటన చేసింది. దీంతో రూ.2కోట్ల నగదు జరిమానా విధించామని తెలిపింది. బ్యాంకింగ రెగ్యులేషన్ చట్టం 1949 లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ అమలు చేస్తున్నట్లు తెలిపింది.
బ్యాంకులో ప్రమోటర్ల వాటా వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని, నిబంధనలు పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాలని షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. బ్యాంక్ నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా విధించాలని నిర్ణయించినట్లు తెలిపింది.