దేశంలో ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ తాజాగా రూ.2,500 కోట్ల నిధులను సమీకరణకు సిద్ధమైంది. దీర్ఘకాలిక వ్యవధి కలిగిన సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలనేది ప్రభుత్వం యోచన. ఎనిమిది సంవత్సరాల కాల పరిమితికి ఈ మేరకు రుణాన్ని పొందనుంది. ఈ దిశగా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని సంప్రదించింది.
ఈ నెల 28వ తేదీన ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం కోసం వేలం నిర్వహించనుంది. ఇందులో పలు సంస్థలు బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా సెక్యూరిటీస్ కొనుగోలు చేస్తాయి. రుణాలపై వడ్డీ రేటును ఆర్బీఐ నిర్ణయించనుంది. సాధారణంగా ఇలాంటి రుణాల్లో 8-10 శాతం వార్షిక వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వాలు సన్నద్ధత వ్యక్తం చేస్తాయి.
బిల్లులు చెల్లించేందుకేనా?
తెలంగాణలో శాసన సభ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పలు రంగాల చెల్లింపులు కలిపి దాదాపు రూ.20,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అంచనా అని విశ్వసనీయ సమాచారం.

వృద్ధాప్య పింఛను, రైతులకు రైతు బంధు పథకంలో భాగంగా వేల కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉందట. అయితే రెండు మూడు నెలలుగా ఎన్నికల నియమావళి అమలులో ఉండటం వల్ల అన్ని రకాల చెల్లింపులకు కాస్త సమయం దొరికింది. కానీ ఇప్పటికే ఎన్నికల సంఘం మోడల్ కోడ్ను ఎత్తివేసింది. దీంతో వచ్చే నెల నుంచి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.2,500 కోట్ల సెక్యూరిటీలు విక్రయించడం ద్వారా ఆ మేరకు రుణాలను సమీకరించి, అత్యవసరమైన చెల్లింపులు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెలాఖరు నాటికి రూ.2,500కోట్లు సమకూరుతాయని అంచనా.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications