ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మార్కెట్లలో జోష్ కనిపించింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. సెన్సెక్స్ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. భాజపా కూటమి మరో సారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రూపాయి విలువ కూడా బలపడింది. బ్యాంకింగ , ఆటోమొబైల్ షేర్లు సోమవారం ట్రేడింగ్ను నడిపించాయి. ఇక బ్యాంకింగ్లో నిఫ్టీ 4శాతం లాభపడగా ఆటో ఇండెక్స్ కూడా 4శాతం లాభాన్ని రికార్డు చేశాయి.
ఇదిలా ఉంటే వాహన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ నాలుగో క్వార్టర్లో ఆ కంపెనీ ప్రకటించిన లాభాల్లో దాదాపు 49శాతం తగ్గుదల నమోదైంది. ఈ త్రైమాసికానికి నికర లాభం రూ.1,108 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికానికి రూ.2,175 కోట్ల నికర లాభం రికార్డు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.86,422 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఇదే సీజన్లో రూ.89,928 కోట్ల ఆదాయం లభించింది. నిర్వహణ లాభం రూ.8,449.5 కోట్లు, మార్జిన్ 9.8శాతంగా నమోదైంది.

జేఎల్ఆర్ పన్ను చెల్లించకముందు 269 మిలియన్ పౌండ్ల లాభాన్నిగడించినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27.1శాతం తక్కువ. జేఎల్ఆర్ ఆదాయం 7,134 మిలియన్ పౌండ్లుగా నమోదైంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడారు. మార్కెట్లలో ప్రస్తుతం సమస్యలు నెలకొన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. నష్టాలు వచ్చినప్పటికీ నాణ్యతలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ రాజీపడబోమని ఆయన అన్నారు. మార్కెట్షేర్ను, లాభాలను తిరిగి సంపాదించుకుంటామని ఆయన అన్నారు. నేటి ట్రేడింగ్లో టాటా మోటార్స్ షేరు ధర రూ.13.30 పెరిగి రూ.190 వద్ద ముగిసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications