ఇండియాలో ఈ ఏడాది భారీగా ఐఫోన్ ఉత్పత్తులు ప్రారంభించనున్న ఫాక్స్కాన్
ఈ ఏడాది భారత్లోనే పెద్ద ఎత్తున ఐఫోన్ ఉత్పత్తులు ప్రారంభిస్తామని ఫాక్స్కాన్ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ టెర్రీ గో వెల్లడించారు. ప్లాంట్ ఎక్స్పాన్షన్ విషయమై భారత ప్రభుత్వంతో ఇన్వెస్ట్మెంట్ నిబంధనల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తాము కీలకంగా మారనున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను భారత్ ఆహ్వానిచారని టెర్రీ గో చెప్పారు. కాగా, కంపెనీ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల వచ్చిన వార్తల మేరకు ఫాక్స్కాన్ తన లేటెస్ట్ ఐఫోన్ ఎక్స్ను భారతదేశంలో ఉత్పత్తి చేయనుంది. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ముందుంది. భారత్లో చైనా స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ మార్కెట్ మాత్రం తక్కువగా ఉంది. ఎందుకంటే దీని ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.