స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల మోత మోగించింది. సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మార్కును, బ్యాంక్ నిఫ్టీ 30,648 పాయింట్ల మార్కును తాకాయి. నిఫ్టీ కూడా 10,700 పాయింట్ల మార్కును అధిగమించింది. చివర్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. మెటల్, బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా రియాల్టీ, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి కౌంటర్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రోత్సాహక సంకేతాలతో పటిష్ట లాభాలతో మొదలైన సూచీలు మిడ్ సెషన్ వరకూ అంతే ఉత్సాహాన్ని కనబర్చాయి. నిఫ్టీ ఒక దశలో 11,738 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. లైఫ్ టైం గరిష్టానికి 25 పాయింట్ల దూరంలో పరుగు ఆపిన నిఫ్టీ చివరకు 45 పాయింట్లు పెరిగి 11,669 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 38,872 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఒక దశలో 30, 648 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే ఆఖరి గంటలో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఏకంగా 350 పాయింట్లు పడిపోయి చివరకు 100 పాయింట్లు నష్టంతో 30,326 దగ్గర ముగిసింది.

పీఎస్యూ స్టాక్స్ ఎక్కడిదాకా
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమకూర్పు సహా వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు ప్రభుత్వ రంగ బ్యాంకులను పరుగులు తీయిస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఆంధ్రా బ్యాంక్ 15 శాతం, యూకో బ్యాంక్ 6 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5.5 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ - యూనైటెడ్ బ్యాంక్ 4 శాతం పెరిగాయి. లక్ష్మీవిలాస్ బ్యాంక్ 10 శాతం, జెకె బ్యాంక్ 8 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 5 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 శాతం పెరిగాయి.
ఇసుజు సేల్స్ జూమ్
ఎస్ఎంఎల్ ఇసుజు మార్చి నెలలో 2003 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే నెలలో పోలిస్తే 14.1 శాతం అధికం. దీంతో ఈ స్టాక్ 4.6 శాతం లాభాలతో రూ.866 దగ్గర క్లోజైంది.
ఇదే సెక్టార్కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అమ్మకాలు ఒక్క శాతం తగ్గాయి. ట్రాక్టర్ అమ్మకాలు 31 శాతం పడిపోవడంతో ఈ స్టాక్ 1.6 శాతం నష్టపోయి రూ.661 దగ్గర ముగిసింది.
ఎస్కార్ట్స్ ట్రాక్టర్ సేల్స్ మార్చి నెలలో 1 శాతం పడిపోయాయి. అయితే ఎగుమతులు 103 శాతం పెరిగినప్పటికీ స్టాక్ మాత్రం నీరసించింది. 3 శాతం నష్టపోయి రూ.776 దగ్గర క్లోజైంది.
మంచి బోణీ
దేశంలో మొట్టమొదటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఎంబసీ రీట్స్ ఈ రోజు లిస్టైంది. ఈ యూనిట్ 3 శాతం లాభాలతో ప్రారంభమైంది. ఒక దశలో రూ. 324.50 గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 4.7 శాతం లాభాలతో రూ.314.10 దగ్గర ముగిసింది. రూ.299-300 మధ్య యూనిట్లను ఎంబసీ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
ఎస్ఆర్ఎఫ్కు పొల్యూషన్ షాక్
ఎస్ఆర్ఎఫ్ సంస్థకు గుజరాత్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్లాంట్ కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా ఉందనే వార్తల నేపధ్యంలో ఈ స్టాక్ భారీగా పతనమైంది. క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకూ ప్లాంట్ మూసివేయాలనే ఆదేశాలతో ఈ స్టాక్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. 20 రోజుల యావరేజ్తో పోలిస్తే 80 రెట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ నమోదయ్యాయి. ఇంట్రాడేలో రూ.2172 స్థాయికి పడిపోయినప్పటికీ స్టాక్ చివర్లో మళ్లీ తేరుకుంది. కేవలం 2 శాతం నష్టాలను నమోదు చేసి రూ.2358 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications