వచ్చే సంవత్సరం కల్లా బిలియన్ డాలర్ల వ్యాపారంలోకి హయర్ ఇండియా గ్రూప్
హోం అప్లయెన్స్ లో అతిపెద్ద చైనా దిగ్గజ కంపనీ హయర్ గ్రూప్ హోమ్ అప్లయెన్స్ మార్కెట్ లో టాప్ 3 వ స్థానాన్ని సాధించాలని నిర్ధేశించుకుంది. ఈ సంధర్భంగా ఇండియా యూనిట్ లో వచ్చే సంవత్సరానికల్లా బిలియన్ డాలర్ల కంపనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ప్రస్థుతం విభాగాలకు తోడు స్మార్ట్ హోమ్స్, సోల్యుషన్స్, స్మార్ట్ లాండ్రీ బిజినెస్ లో ప్రవేశించాలని భావిస్తోంది. ఈనేపథ్యంలోనే రాబోయో రెండెళ్లలో బిలియన్ డాలర్ల కంపనీగా ఎదగాలని ప్రయత్నిస్తున్నట్టు కంపనీ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రిగాంజా చెప్పారు.
చైనా ఉత్పత్తుల ద్వారా పాక్ ఉగ్రవాదులకు నిధులు
2018 లో కంపనీ 50 శాతం వృద్దితో రూ.3500 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇండియాలోని డ్యూరబుల్స్ కంపనీల జాబితాలో టాప్ 5 లో స్థానం పోందినట్లు ఆయన తెలిపారు.ఇందుకు గాను యూపిలోని గ్రెటర్ నోయిడా వద్ద రూ.3 వేల కోట్ల వ్యయంతో రెండో తయారి యూనిట్ ను హయర్ నెలకొల్పుతోంది. ఈ ప్లాంట్ 2020 నాటికి ఉత్పత్తికి సిద్దం కానుంది. ఇండియా మాకు చాల ముఖ్యమైన మార్కెట్ గా భావిస్తున్నామంటూ అందుకే పెట్టుబడులు పెంచుతున్నామని హయర్ గ్రూప్ సౌత్ ఈస్ట్ ఏషియా మేనేజింగ్ డైరక్టర్ సాంగ్ యూజున్ వెల్లడించారు.