రానున్న కాలం అంతా డిజిటల్ కాలమే ఇప్పటికే దేశంలో సుమారు 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు..అది రానున్న కోద్ది సంవత్సరాల్లోనే 60 కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది..దీంతో డిజిటల్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్ధిక విశ్లేకులు భావిస్తున్నారు..దీంతో ఇంటర్ నెట్ ఆర్ధిక వ్యవస్థ సుమారు లక్ష కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఆర్ధిక రంగంలో దూసుకు పోతున్న డిజిటల్ లావాదేవీలు
ఆర్ధిక రంగాన్ని డిజిటల్ రంగం ఉర్రూతలు ఊగిస్తోంది.దీంతో భారత ఆర్ధిక వ్యవస్థలో స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్ నెట్ వాడకం చాల కీలకపాత్ర పోషిస్తున్నాయి..అందుబాటులో స్మార్ట్ ఫోన్ల ధరలు ఉండడంతోపాటు ఇంటర్ నెట్ వాడకం చీఫ్ గా ఉండడం, డిజిటల్ మార్కెట్ విస్తృతికి కారణం అవుతోంది..మరోవైపు ఈ కామర్స్ వెబ్ సైట్లు విపరీతంగా పుట్టుకురావడంతో వాటిలో వ్యాపారం దినదినాభివృద్ది జరుగుతోంది.దీనికి తోడు మొబైల్ అప్లికేషన్స్ లో ఆర్ధిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక మార్కెట్ పోటీని తట్టుకోవడానికి చాల కంపనీలు డిజిటల్ బాట పడుతున్నాయి. ఈనేపథ్యంలోనే రానున్న నాలుగైదు సంవత్సరాల్లో డిజిటల్ వ్యాపారం లక్ష కోట్లకు చేరుకుంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

జీడిపికి వృద్దికి తోడ్పాటు
కాగా ఇది దేశ జీడిపి ని పరుగులు పెట్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో 60 కోట్ల వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతోపాటు ఇంటర్ నెట్ వాడకం సైతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ముఖ్యంగా ఫైనాన్సియల్ సర్వీసులు, రిటైట్ రంగం, మీడియా ,తోపాటు ట్రావెల్ అండ్ హస్పిటాలిటి ,హెల్త్ కేర్ వంటి రంగాల్లో ఇంటర్ నెట్ వాడకం పెరగనుంది. మరోవైపు సోషన్ నెట్ వర్క్, మెసెజ్ లతో కూడా డాటా వినియోగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి...డిజిటల్ రంగంలో వచ్చే విప్లవాత్మక మార్పు వల్ల రానున్న రెండు మూడు సంవత్సారల్లో దేశ జీడిపిలో సుమారు 15 వేల కోట్ల రుపాయలు వరకు డిజిటల్ రంగం నుండి వస్తాయని కూడ అంచనా వేస్తున్నారు. ఇది వార్షిక జీడిపి వృద్దిలో కనీసం ఒక శాతంగా ఉండనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

దేశంలో నెలకు సగటున ఒక జీబీ వినియోగం మాత్రమే
ప్రస్థుతానికి దేశంలో సుమారు 40 కోట్ల మంది ఇంటర్ నెట్ వాడకం దారులు ఉన్నట్టు సమాచారం ..కాగా ఇందులో 56 శాతం మంది నెలకు 1 జీబిని సగటున వాడుతున్నారు. అయితే ఇతర దేశాల్లో మాత్రం ఇది రెండు నుండి మూడు జీబీ ఉండగా ,అభివృద్ది చెందిన దేశాలైన జపాన్ , యూఎస్ లో అది సరాసరి 9-10 జీబీ వరకు ఉంది.

డాటా వినియోగంలో భారత్ 155 వస్థానం
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇంటర్ నెట్ డాటా వినియోగంలో 155 వ స్థానంలో భారత దేశం ఉంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..తాజగా భారత దేశంలో 3జీ,4జీలు ఎక్కువగా వాడుతుండగా 5జీ ప్రయోగదశలో ఉంది. దీంతో ఎయిర్ టెల్,జీయో, సంస్థలు 5జిని సిద్దం చేస్తున్నాయి, 5జి గనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇంటర్ నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.దీంతో డిజిటల్ రంగంలో భారత్ వృద్ది సాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications