అనిల్ అంబానికి మరిన్ని కష్టాలు,తమ అప్పులు చెల్లించాలని ట్రిబ్యునల్ కు వెళ్లనున్న బిఎస్ఎన్ఎల్
రిలయన్స్ కమ్యునికేషన్స్ కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఎరిక్సన్ కంపనీ నుండి సుప్రిం కోర్టులో కష్టాలను ఎదుర్కోంటున్న అనిల్ అంబానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తనకు బకాయి పడ్డ 700 కోట్ల రుపాయల బకాయిలను వసూలు చేసేందుకు రెండు మూడు రోజల్లో నేషనల్ లా ట్రిబ్యునల్ ఆశ్రయించనుట్టు సమాచారం
ఇప్పటికే ఆర్కామ్ దివాలా ప్రక్రియలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్సీఎల్ఏటీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి తోడు ఎరిక్సన్కు చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టులో ఆర్కామ్కు చుక్కెదురైంది. దీంతో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంక్ల కమిటీ ఆధీనంలో ఉన్న ఖాతా నుంచి పన్ను రీఫండ్ సొమ్ము రూ.260 కోట్లు ఇవ్వాలని ఆర్కామ్ కోరింది. దీంతొ దీనికి అంగీకరించని ఎస్బీఐ కన్సార్టీయం ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో దీనికి దానికి సైతం బ్రేకులు పడ్డాయి..ఇక బిఎస్ఎన్ఎల్ కూడ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో అనిల్ అంబానికి మరింత కష్టాలు ఎదురయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాలుగు రోజుల్లో రూ.450 కోట్లు కావాలి.. ! లేదంటే జైలుకే