గోల్డెన్ వీసాతో లండన్ లో నక్కిన నీరవ్ : గోల్డెన్ వీసా అంటే ఏంటీ ?
హైదరాబాద్ : పంజాబ్ బ్యాంకుల కన్షార్షియం నుంచి రూ. 13 వేల కోట్ల రుణం తీసుకొని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ లండన్ లో ఉన్న భారత్ తీసుకురావడంతో జాప్యం ఎందుకు జరుగుతోంది ? లండన్ వీధుల్లో నీరవ్ తిరుగుతున్నారని టెలీగ్రాఫ్ రిపోర్టర్ ప్రపంచానికి చూపించినా .. ఇండియాకు రప్పించడంలో ఆలస్యం ఎందుకవుతోంది ? సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను యూకే హోంశాఖ ఇండియా వెళ్లండి .. అప్పగింత కార్యక్రమం జరుగుతోందని ఎందుకు చెప్పింది. వీటన్నింటికీ కారణం ఆయనకు ఉన్న గోల్డెన్ వీసా.
ఏంటీ గోల్డెన్ వీసా ?
యూరోపియన్ యూనియన్ కు చెందని పెట్టుబడిదారులకు బ్రిటిష్ ప్రభుత్వం టయర్-1 ఇన్వెస్టర్ వీసాను జారీచేస్తుంది. దీనిని యూకే గోల్డెన్ వీసాగా పిలుస్తారు. యూకే ప్రభుత్వ బాండ్లు లేదా కంపెనీ షేర్లలో 20 లక్షల పౌండ్లు ..దాదాపు 18 కోట్ల పెట్టుబడులు పెట్టేవారికి అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీచేస్తుంది. నీరవ్ మోదీ కూడా గోల్డెన్ వీసా ద్వారానే బ్రిటన్ లో ఉంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అతనికి ఇంతకుముందే గోల్డెన్ వీసా జారీ అయినట్టు సమాచారం.
ఐదేళ్లు పెట్టుబడి పెడితే శాశ్వత పౌరసత్వం
ఓ వ్యక్తి యూకేలో వ్యాపారం నెలకొల్పడం, లేదంటే పనిచేయడం, చదువుకొనేందుకు గోల్డెన్ వీసా అనుమతిస్తోంది. అయితే ఒకసారి రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. సదరు వ్యక్తి ఐదేళ్లపాటు పెట్టుబడులు పెడితే వారికి శాశ్వత పౌరసత్వానికి అర్హుడవుతారు.
నాలుగు రోజుల్లో రూ.450 కోట్లు కావాలి.. ! లేదంటే జైలుకే
విదేశాల్లో ఉంటూ కూడా ..
గోల్డెన్ వీసాలో చాలా వెసులుబాటులు ఉన్నాయి. సదరు వ్యక్తి లండన్ లో ఉంటూ పెట్టుబడులు పెట్టొచ్చు. లేదంటే విదేశాల్లో ఉంటూ కూడా పెట్టుబడి పెట్టే వీలుంది. విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. జనవరి వరకు అమెరికాలో ఉండి .. తర్వాతే లండన్ తిరిగి వచ్చారు. అయితే గతేడాది మేలో డైమండ్ హోల్డింగ్స్ పేరుతో వజ్రాభరణాల షోరూమ్ ను నీరవ్ రిజిష్టర్ చేయించినట్టు తెలుస్తోంది. కంపెనీ చిరునామాగా స్కాటిష్ ప్రావిడెంట్ హౌస్ ను చూయించారు. ఈ అడ్రస్ నీరవ్ అకౌంటెంట్ దత్తానీ చార్టెర్డ్ అకౌంటెంట్స్ కు చెందినది.