జీ గ్రూప్లో 19 శాతం వాటాను కొనుగోలు చేయనున్న జపాన్కు చెందిన సోనీ
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం సోనీ కార్పోరేషన్.. సుభాష్ చంద్ర నేతృత్వంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఈఈఎల్)ను కొలుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. దీని విలువ రూ.13వేల కోట్లుగా తెలుస్తోంది.
ఈ అంశంపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ఇవి చివరి దశలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 20 నుంచి 25 శాతం వాటాలను విక్రయించాలని సుభాష్ చంద్ర భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ అమ్మకం ద్వారా వచ్చిన రూ.13 వేల కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించే అవకాశం కనిపిస్తోంది.
ఈ షేర్లపై సుభాష్ చంద్ర దాదాపు 30 శాతం ప్రీమియం కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సుభాష్ చంద్ర ఎంత వాటా ఉంచుకోవాలనే దానిపై ప్రస్తుతం చిక్కుముడి కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సెల్ గ్రూప్ జీలో 41.62 శాతం వాటాను కలిగి ఉంది. వాటిలో సగం పైగా ప్రస్తుతం రుణదాతల వద్ద తనఖాల్లో ఉన్నాయి.
జార్ఖండ్ హై కోర్టు జోక్యం మధుకాన్ కంపనీలపై కేసు నమోదు చేసిన సిబిఐ
ప్రస్తుతం సుభాష్ చంద్ర తన వద్ద ఇరవై శాతం వాటా ఉంచుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రూ.650 రేటు వద్ద తన 19 శాతం వాటా విక్రయించినా రూ.13 వేల కోట్ల వరకు పొందే అవకాశముంది. దీంతో పరిస్థితిని తన అధీనంలోకి తెచ్చుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం జీ సంస్థకు 171 దేశాల్లో దాదాపు 66 టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి. ఇది సోనీకి కలిసి వచ్చే అంశం.