టీడీపీ మాజి ఎంపి నామా నాగేశ్వర్ రావు కు చెందిన మధుకాన్ పై సిబిఐ కేసు నమోదు చేసింది..జార్ఖండ్ లో ప్రారంభమైన నేషనల్ హైవే పూర్తి చేయకుండా కెనారా బ్యాంక్ కన్సార్టీయం బ్యాంకులను ఉద్దెశ్యపూర్వకంగా నష్టం కల్గించినందుకు గాను సిబిఐ కేసు నమోదు చేసింది.
పూర్వపరాలు..జార్ఖండ్ లో 2011 లో మధుకాన్ చేపట్టిన 163 కిలోమిటర్ల హై వే పూర్తి కాకపోవడంవతో జార్ఖండ్ హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సుమోట గా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ కార్యలయం రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికిల్ రాంచీ ఎక్స్ ప్రెస్ సిఎమ్డీ శ్రీనివాస రావుతోపాటు మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్ ,ఇన్ ఫ్రా,మధుకాన్ టోల్ హైవే ,అడిటింగ్ కంపనీ లపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.కాగా ఈ కేసులో బ్యాంక్ కన్యస్టారీయం లోని కోంతమంది అధికారులపై కూడ సిబిఐ కేసును నమోదు చేసింది.

ఏం జరిగింది..
ధుకాన్ కంపనీ జార్ఖండ్ లో చేపట్టిన 163 కిలో మీటర్ల 33 నంబర్ జాతియ రాహదారి అయిదేళ్ల లో పూర్తి కావాలి ,అయిదేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు విస్తరణ పనులు కాకపోవడంతో జార్కండ్ హైకోర్టు జోక్యం చేసుకుంది..దీంతో విచారణ చేపట్టింది..కాగా విచారణ సంధర్భంగా రోడ్డు ఏ స్థితిలో ఉందో తెలియకుండానే బ్యాంకులు 1029 కోట్లను మంజురు చేసిందన ఎస్ఎఫ్ఐవో తెలిపింది. కాగా ఈనిధుల్లో సుమారు 264 కోట్ల రుపాయలను కంపనీ దారి మళ్లించిందని గుర్తించింది. కాగా ఈ నిధులను రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు వినియోగించలేదని తన నివేదికలో వివరించింది. బ్యాంకుల నుండి రూ 1029 కోట్లను రుణంగా పోందేందుకు కంపనీ డైరక్టర్లు మోసపూరితంగా వ్యవహరించారని గుర్తించింది. రుణం తీసుకున్నప్పటికి పనుల్లో ఎలాంటీ పురోగతి లేదని తెలిపింది.దీంతో 2018 లో ఈ రుణం నిరర్థక ఆస్థిగా మారిందని పేర్కోంది. కాగా ఎస్ఎఫ్ఐఓ నివేదిక ఆధారంగా సిబిఐ ప్రాధమిక విచారణ చేపట్టింది. కాగా ఈ ఏడాది జనవరి 31న ఎన్ హెచ్ ఏఐ ఈ కాంట్రాక్టును రద్దు చేసింది.కంపనీ బ్యాంకు గ్యారంటీగా పెట్టిన రూ. 73 కోట్ల డిపాజిట్లను ఎన్ హెచ్ ఏఐ స్వాధినం చేసుకుంది.


Click it and Unblock the Notifications