బ్లాక్ మని నగదు రూపంలో లేదు, నోట్ల రద్దును వద్దన్నాం
పేద్ద నోట్ల రద్దును మేము అప్పుడే వద్దాన్నాం...అంటూ కోంత మంది ఆర్బీఐ డైరక్టర్లు చెప్పారట..దాదాపు రద్దు పై పుంఖానుపుంఖానులుగా ఆర్బీఐ ,కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి..దీంతో ఆర్బిఐ బోర్డులోని కోంతమంది డైరక్టర్లు నోట్ల రద్దు వద్దని చెప్పారట...
పెళ్లిల్ల సైతం వాయిదా వేసుకున్న కుటుంబాలు
పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు అందరికి తెలిసినవే, బడాబాబులు ముందే సర్దుకోగా మధ్యతరగతి తోపాటు బీదవర్గాలవారు నోట్లను మార్పిడి చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కనీసం రోజువారి ఖర్చులను కూడ బ్యాంకుల్లో నుండి తీసుకోలేని పరిస్థితి.ముందుగా పెట్టుకున్న ముహుర్తాల ప్రకారం పెళ్లిల్లను కూడ వాయిదా వేసుకున్నపరిస్థితి ...
డీమానిటైజేషన్ టైంలో పెట్రోల్ బంకుల్లోకి వచ్చిన రూ.500/1000 నోట్లు ఎన్నో మాకూ తెలియదు - ఆర్బీఐ
టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం
అయితే పెద్ద నోట్ల రద్దు జరిగేటప్పుడు కేంద్రం ఎవ్వరితోను చర్చలు జరపలేదని ప్రధాని మోడి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని పలు విమర్శలు వచ్చాయి..అయితే ఈ నేపధ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్రం పలు దఫాలు చర్చలు జరిపినట్లు వెల్లడయింది..అయితే ఈ చర్చల్లో పలువురు నోట్ల రద్దును వ్యతిరేకించారని తెలుస్తోంది....అయితే చర్చల్లో భాగంగా బ్లాక్ మని అరికట్టడంతోపాటు ఫేక్ కరెన్సి నిరోధం, ఎలక్ట్రానిక్ చెల్లింపులు పెరుగుతాయని ప్రభుత్వం వివరించింది..కాగా ప్రజలందరు భాగస్వామ్యం కావడానికి,ఆధికారికి ఆర్ధిక వ్యవస్థలో భాగం కావడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్రమోడి సైతం పేర్కోన్నారు, అయితే కోంతమంది ఆర్బీఐ డైరక్టర్లు ప్రభుత్వ వాదనతో విభేదించారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది..
బ్లాక్ మని నగదు కంటే బంగారం,ఆస్తుల రూపంలో ఉంది
ఆర్బిఐ చర్చల్లో బాగంగా బ్లాక్ మని నగదు రూపంలో లేదని అది బంగారం, రియల్ ఎస్టెట్ వంటి ఆస్తుల రూపంలో ఉందని డైరక్టర్లు ప్రస్తావించారు..దీంతో నోట్ల రద్దు బ్లాక్ మనీ పై ఎలాంటీ ప్రభావం చూపదని చెప్పారు..కాగా ఆర్ధిక వ్వస్థ విస్తరణతో పోలిస్తే ,పెద్దనోట్ల చలామణి ఎక్కువగా ఉందనే ప్రభుత్వ అభిప్రాయంతోను ఈ డైరక్టర్లు ఏకిభవించలేదు.ఇక ఫేక్ కరెన్సి సైతం మొత్తం చలామణిలో ఉన్న కరెన్సి లో రూ.400 కోట్ల మాత్రమే ఉందని ఇది పెద్దగా ఆందోళన కల్గించాల్సిన అంశం కాదని పేర్కోన్నారు.
ఏకగ్రీవంగా పెద్ద నోట్ల రద్దును అమోదించిన డైరక్టర్లు
మొత్తం మీద ఆరు నెలల పాటు ఈ చర్చలు జరిగినా చివరికి డైరక్టర్ లు పెద్ద నోట్ల రద్దుకు ఒప్పుకున్నారు..ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడడంతో పాటు బ్లాక్ మని ,ఫేక్ నోట్స్ వ్యవస్థ , ఆన్ లైన్ పేమెంట్స్ పెరుగుతయానే ఆలోచనకు మద్దతుపలికారు..అయితే నోట్ల రద్దు అనేది హఠత్తుగా తీసుకున్న నిర్ణయమని ఇది తెలియదని చెప్పినా...సుమారు ఆరు నెలల పాటు చర్చలు జరిగాయి ,కాని వీటి సారంశం ఏమిటనేది తెలియదని కథనంలో పేర్కోంది.