ఎరిక్సన్ కు ఐటి రిఫండ్స్ నుండి బాకాయి చెల్లించేందుకు నిరాకరించిన రుణదాతలు...
ఇప్పటికే అప్పుల్లో కురుకుపోయిన ఆర్ కామ్ కంపనీ అధినేత అనిల్ అంబానికి తమ రుణ దాతల నుండి మరో ట్విస్ట్ వచ్చిపడింది..దీంతో మరో సారి చిక్కుల్లో పడ్డారు అనిల్ అంబానీ...ఎరిక్సన్ కు నెల రోజుల్లోగా 550 కోట్ల రుపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది..ఇలాంటీ నేపథ్యంలోనే ఎరిక్సన్ కు తక్షణమే 280 కోట్లు చెల్లించేందుకు నిర్ణయించింది..
ఇందుకు రుణదాతలను అభ్యర్థించింది...అయితే ఎరిక్సన్ కు చెల్లించేందుకు వీలుగా ఐటి రిఫండ్స్ ను విడుదల చేసేందుకు అనుమతించాలంటూ నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ను కోరింది ...అయితే అందులో ఉన్న కంపనీ రుణదాతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు...ఈనేపథ్యంలోనే కంపనీలో ఉన్న ఫైనాన్సీయల్ క్రెడిటర్సుగా ఉన్న ఏస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు మార్చీ 8 నాటికి తమ నిర్ణయాన్ని చెప్పాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారి చేసింది. రిలయన్న్ తన పిటిషన్ లో ఎరిక్సన్ కు ఇవ్వాల్సిన బకాయిలను నేరుగా ఎరిక్సన్ కు బదీలి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది..
అయితే రుణ దాతల తరపు న్యాయవాదులు మాత్రం రిలయన్స్ అభ్యర్థణను వ్యతిరేకించారు.దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ట్రిబ్యునల్ సరైన్ వేదిక కాదంటూ వారు వాదించారు..ఈనేపథ్యంలోనే మార్చి 11న విచారణ చేపట్టనున్నట్టు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారి చేసింది..