260 కొట్ట రుపాయలను ఎరిక్సన్ కు బదిలిచేసేందుకు అంగీకారం తెలపాలని రుణ దాతలను కోరిన రిలయన్స్ ...
తక్షణం 260 కోట్లను స్వీడన్ కంపనీ ఎరిక్సన్ కు చెల్లించేందుకు తమ రుణదాతలు అమోదం తెలపాల్సిందిన రిలయన్స్ కోరింది...నాలుగు వారల్లో ఎరిక్సన్ కు 550 కోట్ల రుపాయలు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రిలయన్స్ కమ్యునికేషన్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది..డబ్బులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది..ఈనేపధ్యంలోనే తన ఖాతాలో ఉన్న రూ.260 కోట్లను నేరుగా స్వీడన్ టెలికాం కంపెనీకి బదిలీ చేయడానికి తక్షణం ఆమోదం తెలపాల్సిందిగా రుణదాతలను కోరింది.
'ఆదాయ పన్ను రిఫండ్ల రూపంలో ఖాతాలో ఉన్న రూ.260 కోట్ల వరకు మొత్తాన్ని నేరుగా ఎరిక్సన్కు పంపడానికి తక్షణం అనుమతినివ్వాలని రుణదాతలకు ఆర్కామ్ విజ్ఞప్తి చేసింద'ని ఆర్కామ్ ప్రతినిధి ఒక ప్రకటనలో గురువారం పేర్కొన్నారు.కాగా వీటి చెల్లింపుల కోసం దిల్లీ, ముంబయిలలోని స్థిరాస్తి ఆస్తులను ఆర్కామ్ విక్రయించొచ్చని.. అదే సమయంలో ఫైబర్, ఎమ్సీఎన్ ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపులను వేగవంతం చేయాలని జియోను కోరవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.