సమ్మే ను కొనసాస్తున్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు...
బిఎస్ఎన్ఎల్ కోనసాగిస్తున్న సమ్మే రెండో రోజుకు చేరింది..తమ డిమాండ్ల సాధన కోసం సుమారు 20 వేల మంది ఉద్యోగులు సోమవారం నుండి సమ్మేలో ఉన్నారు..కాగా సమ్మే బుధవారం వరకు కొనసాగన్నట్టు సమాచారం..
ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు గుప్పిట్లో ఉంచేందుకు ప్రయత్నాలు కొనసాగడంతోపాటు బిఎస్ఎన్ఎల్ ను బలహీన పరిచే కుట్రలు పన్నుతున్నారని పలువురు ఉద్యోగులు అరోపించడంతో పాటు తమ డిమాండ్ల సాధనకు మూడు రోజుల సమ్మేను తలపెట్టారు ..కాగా సమ్మేలో సుమారు 90 శాతం మేర ఉద్యోగులు పాల్గోన్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి..ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగ కార్మికులు కదిలారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ సేవలు ఆగే పరిస్థితి. 90 శాతం మేరకు ఉద్యోగ, కార్మికులు విధుల్ని బహిష్కరించడంతో కార్యాలయాలన్నీ నిర్మానుష్యం అయ్యాయి. అన్ని రకాల సేవల్ని నిలుపుదల చేసిన ఉద్యోగ, కార్మికులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. చెన్నైలో అయితే, ప్రధాన కార్యాలయంతో పాటుగా బ్రాంచ్లలో సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగ కార్మికులు సమ్మె బాట పట్టడంతో కార్యాలయాల వద్ద హడావుడి తగ్గింది. కాగా ఇలాగే పరిస్థితి కొనసాగితే తీవ్రమైన పోరు కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిచ్చాయి...