మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ధనవంతులైన MLA అభ్యర్థులు ఎవరో తెలుసా?

MLA అభ్యర్థులుగా ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేసారు వీరిలో ధనవంతులైన అభ్యర్థులు వీరే:

2014 లో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు.ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాలకే రద్దు చేసి 2018 డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన TRS పార్టీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గణ విజయం సాధించిన విషయం తెలిసిందే.ప్రత్యర్థి పార్టీ లో ఎంతో మంది తలపండిన నాయకులు సైతం కారు జోరు ముందు కకావికలమైపోయారు.

MLA అభ్యర్థులుగా ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేసారు వీరిలో ధనవంతులైన అభ్యర్థులు వీరే:

1. కె.రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)

1. కె.రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)

300 కోట్ల రూపాయల ఆస్తులతో కాంగ్రెస్ తరుపున రాజీగోపాల్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మొదటి ధనవంతుడు.

నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజగోపాల్ తన ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేసిన కుటుంబ ఆస్తుల విలువ 314 కోట్లు అని ప్రకటించారు.

గత నాలుగు సంవత్సరాల్లో అతని ఆస్థి నికర విలువ 371% పెరిగింది. కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త, 2014 లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పోటీ చేసినపుడు రూ.66 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. 2009 నుండి 2014 వరకు రాజగోపాల్ లోక్సభ ఎంపీగా ఉన్నారు,ఆ తరువాత తెలంగాణ శాసన మండలి సభ్యుడు గా ఉన్నారు.ప్రస్తుతం మునుగోడు శాసనసభ్యుడిగా గెలుపుపొందారు.

2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ .34,83,550, తన భార్య రూ .1,17,16,370 గా ఉందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు.రాజగోపాల్ తన నాలుగు ఖాతాలలో రూ.11,89,688 రూపాయలు ఉన్నాయని, అతని భార్యకు ఉన్న రెండు ఖాతాలలో 35,03,892 రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అని పేర్కొన్నారు.

తన వద్ద రూ.35 లక్షల విలువైన 1,080 గ్రాముల బంగారం ఉందని అలాగే అతని భార్యకు 3,996 గ్రాముల బంగారం విలువ రూ.1,38,17,554 రూపాయలు ఉందని మరియు 20 కిలోల వెండి విలువ రూ. 6,80,850 రూపాయలు,రూ.50 లక్షల విలువచేసే 30 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

తాను ప్రస్తుతం నడుపుతున్న మొత్తం ఆస్తులు రూ .5,01,56,328 అని, ఆయన భార్య రూ 261,84,64,626 రూపాయలని ప్రకటించారు. వారి స్థిర ఆస్తులు 19,54,30,850 రూపాయలు మరియు 27,91,18,602 రూపాయలుగా ఉన్నాయి.

2. మర్రి జనార్ధన్ రెడ్డి (టిఆర్ఎస్)

2. మర్రి జనార్ధన్ రెడ్డి (టిఆర్ఎస్)

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రెండవ ధనవంతుడుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి (టిఆర్ఎస్) చెందిన మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి తిరిగి పోటీ చేస్తున్న ఈన తన ఎన్నికల అఫిడవిట్లో కుటుంబ ఆస్తుల విలువ రూ .161 కోట్లు ప్రకటించారు.

వ్యాపారవేత్తలైన జనార్ధన్ మరియు అతని భార్య మర్రి జమునా రాణి, 2017-18లో రూ. 8 కోట్ల ఆదాయం కలిగి, నాలుగు సంవత్సరాలలో 22% పడిపోయింది.

మొత్తం రూ.5,92,42,403 రూపాయల ఆదాయం ప్రకటించారు. ఆయన భార్య పై రూ .245,61,685 రూపాయల ఆస్థి ఉందని ప్రకటించారు.

అతని ప్రస్తుత ఆస్తులకు సంబంధించి, అతనికి రూ .4,92,914 నగదు, అతని భార్యకు 3,06,581 రూపాయలు ఉందన్నారు. మొత్తం బ్యాంకు బ్యాలెన్స్ రూ .8,72,502, అతని భార్య కు రూ .7,05,050.

అతను రూ .10,89,70,120 షేర్లలో పెట్టుబడులు పెట్టారు, అతని భార్య రూ .1,39,30,000 రూపాయల పెట్టుబడి పెట్టిందన్నారు. రూ .7,17,925 విలువైన 235 గ్రాముల ఆభరణాలు ఆయనకు ఉన్నాయని అలాగే అతని భార్య కు రూ. 58,41,160 విలువైన 1,912 గ్రాముల బంగారం ఉందని ప్రకటించారు.

3. జి యోగానంద్ (బిజెపి)

3. జి యోగానంద్ (బిజెపి)

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కి చెందిన (బిజెపి) జి.యోగానంద్ మూడవ ధనవంతునిగా రూ. 146 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. హైదరాబాద్ నగరం శివార్లలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి యోగానంద్ పోటీ చేసాడు.

తాజా ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ.1,82,53,744 కోట్లు కాగా, అతని భార్య రూ .32,93,410 లక్షలని పేర్కొన్నారు.తనకు రూ.5,23,400 నగదు ఉందని, అతని భార్యకు రూ.24,200 రూపాయలు ఉందన్నారు. అదేవిధంగా బ్యాంకులో రూ .27,89,775 లక్షలు ఉందని, అతని భార్యకు రూ.24,48,854 రూపాయలు ఉందని తెలిపారు.

యోగానంద్ కు రూ. 8,70,000 విలువైన 300 గ్రాముల బంగారం ఉందని,రూ.1,60,000 రూపాయల విలువైన 4,000 గ్రాముల వెండి, అతని భార్యకు రూ .16,762,145 విలువైన 5780.05 గ్రాముల బంగారం, రూ.1,80,000 రూపాయల విలువైన 4,500 గ్రాముల వెండి ఉందన్నారు. వారి స్థిరాస్తులు 89,174,900 రూపాయలు మరియు 39,249,900 రూపాయలు విలువైనవి ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

4. నామా నాగేశ్వరరావు (టిడిపి)

4. నామా నాగేశ్వరరావు (టిడిపి)

ఖమ్మం నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి (టిడిపి) నామా నాగేశ్వర రావు రూ. 113 కోట్ల ఆస్తులతో నాల్గవ స్థానంలో నిలిచాడు. 2009-2014 నుంచి ఆయన పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు, ఆ సమయంలో దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీలలో ఒకరుగా ఉన్నారు, 2014 లోక్సభ ఎన్నికలలో 338 కోట్ల ఆస్తులు ప్రకటించారు.

మధుకోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు నగేశ్వర రావు తెలంగాణలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఒకరు. తాజాగా ఇచ్చిన అఫిడవిట్లో ఆయన మరియు భార్య నామా చిన్నమ్మ, 2017-18లో రూ. 1.76 కోట్లు ఆదాయం పొందారు.

తాజా ఆర్థిక సంవత్సరానికి నాగేశ్వర ఆదాయం రూ .56,43,245, మరియు అతని భార్య రూ .11,23,376 రూపాయలుగా గా ప్రకటించారు. అతడికి నగదు రూపంలో రూ.2,11,000 రూపాయలు ఉంది, అతని భార్యకు రూ. 15,000 ఉందన్నారు. వారి బ్యాంకు ఖాతా నిల్వలు రూ .16,53,227 మరియు రూ .42,40,164 రూపాయలు. నాగేశ్వర రావు కు రూ .1,53,899,812 విలువైన పెట్టుబడులు ఉన్నాయని ప్రకటించారు మరియు అతని భార్య రూ.97,378,715 రూపాయల విలువైన షేర్లను కలిగి ఉన్నానని చెప్పాడు. నాగేశ్వరరావు యొక్క ఇద్దరు కుమారుల వాటా షేర్లు రూ.2,89,85,215 మరియు రూ.3,826,040 రూపాయలు కలిగి ఉండగా, అతని కుమార్తె పై ఎటువంటి వాటాలు లేవని పేర్కొన్నారు.

నాగేశ్వర తన మొత్తం ఆస్తులు రూ. 43,89,79,801 అని, అతని భార్య ఆస్తులు రూ .25,71,07,880 ఉన్నాయని పేర్కొన్నారు.వారి స్థిరమైన ఆస్తుల విషయానికి వస్తే, నాగేశ్వర రావు రూ .9,80,17,230 ఆస్తులు, అతని భార్య రూ .27,03,06,000, మరియు అతని కుమారుడు రూ. 2,85,61,000 విలువైన స్థిరమైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+