మూడేళ్లలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు: వేదాంత అనిల్ అగర్వాల్
ముంబై: వచ్చే మూడేళ్లలో భారత దేశంలో తాము రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు పెట్టుబడులు పెడతామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగ్వార్వాల్ వెల్లడించారు. ఆయన ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల జింక్ను ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా భారత్, ఆఫ్రికాల్లో జింక్ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. చమరు, లోహ వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ యూనిట్ ద్వారా చమురు, సహజ వాయు రంగాల్లో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టే యోచనలో ఉన్నామన్నారు.
భారత్లో 1,400 టన్నుల వెండిని ఉత్పత్తి చేసే దిశగా కంపెనీ పని చేయబోతోందని అన్నారు. గ్లాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో దీనిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వేదాంత పెట్టాలని నిర్ణయించిందన్నారు.