ముంబై: మన దేశంలో తొమ్మిది మంది కోటీశ్వరుల వద్ద సగం ఆదాయం ఉండగా, మిగతా ప్రజల వద్ద సగం ఆదాయం ఉందట. అంటే సగం ఆదాయం కేవలం 9మంది వద్దే ఉంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒక శాతం మంది ఆదాయం 39 శాతం పెరిగింది. దిగువ భాగంలో ఉన్నవారి ఆదాయం మాత్రం మూడు శాతం మాత్రమే పెరిగింది.
ఈ వివరాలను అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్ఫాం తన నివేదికలో వెల్లడించింది. తన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా బిలయనీర్ల ఆదాయం గత ఏడాది 12 శాతం (రోజుకు 2.5 బిలియన్ డాలర్లు) పెరగగా, దిగువన ఉన్న పేదల ఆదాయం మాత్రం 11 శాతం క్షీణించింది.

భారత్లో 10 శాతం జనాభాకు సమానమైన 13.6 కోట్ల మంది ప్రజలు 2004 నుంచి అప్పుల్లోనే ఉన్నారు. సంపద అంతా కొందరి వద్దే కేంద్రీకృతమైంది. ప్రపంచంలోని సగం పేదవారి వద్ద ఉన్న మొత్తం ఆదాయం కేవలం 29 ధనికుల వద్ద ఉంది. గత ఏడాది ఇంత ఆదాయం 44 మంది వద్ద ఉండేది. ఇప్పుడు 29 మంది వద్దే ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ సంపద 112 బిలియన్ డాలర్లు. ఆయన ఆదాయంలో ఒక శాతం ఆదాయం 115 మిలియన్ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్తో సమానం.
భారత్లో పది శాతం ధనికులు జాతీయ ఆదాయంలో 77.4 శాతం కలిగి ఉన్నారు. జనాభాలో ఒక శాతం సంపన్నుల వద్ద 51.53 శాతం సంపద ఉంది. దిగువన ఉన్న 60 శాతం మంది వద్ద జాతీయ ఆదాయంలో 4.8 శాతం సంపద మాత్రమే ఉంది. భారత్ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం తొమ్మిది మంది బిలియనీర్ల వద్ద ఉంది. 2022 లోగా భారత్ నుంచి మరో డెబ్బై మంది బిలియనీర్లు పుట్టుకు రావొచ్చునని అంచనా వేసింది.
గత ఏడాది భారత్లో 18 మంది కొత్త బిలియనీర్లు వచ్చారు. భారత్లో బిలియనీర్ల సంఖ్య 119. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా రూ.28 లక్షల కోట్లు. దేశంలోని అత్యంత సంపన్నులు తమ ఆదాయంలో 0.5 శాతం అదనంగా పన్ను చెల్లిస్తున్నారు. కేవలం తొమ్మిది మంది బిలియనీర్ల ఒకరోజు ఆదాయం రూ.2,200కు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications