వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన 13 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన పాద యాత్ర ముగింపు సబ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన 13 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన పాద యాత్ర ముగింపు సబ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టారు.

జగన్ పాదయాత్ర
తన పార్టీ ప్రకారం, జగన్ 3,000 కి.మీ. మరియు 134 నియోజకవర్గాలను చుట్టేసింది, ఇది భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని పొడవైన పాదయాత్రగా పిలుస్తున్నారు. 'రావాలి జగన్' (కావాలి జగన్) అనే నినాదంతో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు 2 కోట్ల మందిని చేరుకున్నారు.

ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు
పాదయాత్ర సమయంలోమాట్లాడుతూ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని జన్మభూమి కమిటీల పేరిట భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తానని ప్రజలకు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ రైతులకు
పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి పలు ముఖ్యమైన వాగ్దానాలు చేసారు.చిన్న రైతులకు అధిక లబ్ది పొందేలా తమ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.ఒక ఎకరా కు రూ.12,500 రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామన్నారు.దీని వల్ల చిన్న రైతులకు తమ పంట పెట్టుబడికి సంబంధించి ఖర్చు సుమారు 70 నుండి 80 శతం తగ్గుతుందని అన్నారు.

ఉచిత బోర్లు:
రైతులకు జగన్ అందిస్తున్న మరో అబ్భుత వరం ఉచిత బోర్లు.దీని పై జగన్ మాట్లాడుతూ రాష్ట్రము లో అనేక మంది రైతులు ప్రతి ఏటా కొన్ని వేల బోర్లు వేసి నష్టపోతున్నారు అని వెల్లడించారు.వేసిన బోర్లలో నీళ్లు పడక ఒకవేళ నీళ్లు పడిన కొన్ని రోజులకే ఎండిపోవడం చూస్తున్నాం అని అన్నారు అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వీటిని నివారించడానికే తాము ఈ ఉచిత బోర్లు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రైతులకు ఉచిత భీమా:
జగన్ తన ప్రసంగంలో మాట్లాడుతూ రైతులకు భీమా పథకం కూడా ప్రవేశపెట్టాడు.ప్రస్తుతం ఉన్న రోజుల్లో రైతులకు తమ పంట పై అనుకోని విపత్తు సంభవించి పంట పూర్తిగా నష్టపోతే భీమా వస్తుందో రాదో అనే ఆందోళన చెందుతున్నారని నొక వేల వస్తే ఎపుడు వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు.అలంటి ప్రతి రైతులకు భీమా చెల్లించే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

ఆక్వా రైతులకు:
అదేవిదంగా ఆక్వా రైతులను ఆదేశించి మాట్లాడుతూ వారికి కరెంటు రేటుకేవలం రూ.1.50 రూపాయలకే ఇస్తామని హామీ ఇచ్చారు.వీటి వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుందని తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications