నిరవ్ మోడీపై నమోదైన నగదు బదిలీ కేసులో హొంగ్ కాంగ్ లో 34.97 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్ల) రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.
నిరవ్ మోడీపై నమోదైన నగదు బదిలీ కేసులో హొంగ్ కాంగ్ లో 34.97 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్ల) రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.దీంతో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ ఛోక్సీకి సంబంధించి ఈడీ జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,744 కోట్లకు చేరింది.

మోడీ మరియు అతని మామయ్య మెహల్ చోక్సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 13,000 కోట్ల రూపాయలకు పైగా నష్టపరిచారని ఆరోపించారు. ఈ నెలలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ .637 కోట్ల విలువైన ఆస్తులు, భారతదేశంలో అతని కుటుంబం, మరో నాలుగు ఇతర దేశాలలో ఉన్న ఆస్తులను జప్తు చేసారు.
విచారణ సమయంలో, నిరవ్ మోడీ కంపెనీలకు సంబందించిన కొన్ని విలువైన వస్తువులు హాంకాంగ్ ఆధారిత లాజిస్టిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నాయి అని కనుగొన్నారు.పూర్తి విచారణ చేసిన తరువాత విలువలు, సరుకు రవాణా, ఎగుమతి చేసినవి,ఈ వస్తువులకు సంబందించిన యాజమాన్యం మరియు విలువ యొక్క రుజువులు దొరికిన తరువాత అవి కూడా జత చేస్తామని ED తెలిపింది.
గతంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన ED, నిరవ్ మోడీ విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. హాంకాంగ్లో రూ. 22 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలు,US లో రూ. 216 కోట్ల విలువైన రెండు అపార్ట్మెంట్లు, లండన్ లో ఉన్న అపార్ట్మెంట్ విలువ రూ. 58 కోట్లు, ఆరు బ్యాంకు ఖాతాల నుండి 322 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
దక్షిణ ముంబయిలోని ఒక బ్రాంచీలో 11,380 కోట్ల రూపాయల విలువైన మోసపూరిత, అనధికార లావాదేవీలను కనుగొన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిఎస్ఇకి తెలియగానే ఫిబ్రవరిలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
నిరవ్ మోడి, అతని సహచరులతో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించినట్లు ఆరోపణలు వచ్చాయి, కొందరు బ్యాంకు అధికారులు కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి.
తాజాగా జత చేసిన ఆస్తులతో కలిపి చూస్తే మొత్తం విలువ ఇంతవరకు రూ .4,744 కోట్లకు చేరింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications