సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ గిఫ్ట్ మీరే చూడండి
రైలు ప్రయాణం అంటే ప్రయాణికులకు ఆ రైలు టైంకి వస్తుందా? లేదా? అనే సందేహం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయితే ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోనే గంటల సేపు వేచిచూడాల్సి వస్తుంది.
కాచిగూడ
ఇక ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వీరి ఇబ్బందులు చుసిన సౌత్ సెంట్రల్ రైల్వే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికి కాచిగూడ రైల్వే స్టేషన్ వేదికగా నిలిచింది.
మొబైల్ థియేటర్
స్వచ్ఛభారత్ పై అవగాహనా కలిగించడంతో పాటు రైల్వే స్టేషన్ కి వచ్చిన ప్రయాణికులకు సంతోషాన్ని పంచడానికి స్టేషన్ ఆవరణలో మొబైల్ థియేటర్ ఏర్పాటు చేసారు. దీనిలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి స్వచ్ఛ భరత్ మరియు స్వచ్ఛ రైల్వే పై రూపొందించిన వీడియోలు ప్రదర్శిస్తున్నారు
సందేశాత్మక సినిమాలు
రంగస్థలం మరియు భరత్ అనే నేను ఎలా సమాజానికి సందేశాన్ని ఇస్తున్న సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మన తెలుగు సినిమాలే కాకుండా వివిధ భాషలో సందేశాత్మక సినిమాలు ప్రదర్శిస్తున్నారు.
150 మంది
ఇక ప్రస్తుతం కాచిగూడలో ఈ సినిమాల ప్రదర్శన మొదలు పెట్టారు ఇక్కడ ఒక పది రోజులు ప్రదర్శించిన తర్వాత మిగతా స్టేషన్లలో కూడా ఇలా ప్రదర్శిస్తారు. ఇక ఒకేసారి 150 మంది కూర్చొని సినిమా చూసే విధంగా వీటిని ఏర్పాటు చేసారు. ఇక దీనిలో AC సౌకర్యం కూడా ఉంటుంది.
ఎంట్రీ
ఇక మనం సినిమా చూడడానికి మాములుగా అయితే కనీసం రూ.500 అవుతుంది. కానీ దీనిలో మనం సినిమా చూడాలి అంటే ఒక రూపాయి కూడా ఖర్చు కాదు ఎందుకంటే దీన్లో ఎంట్రీ ఉచితం.