త్వరలో పెద్ద ఎత్తున క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు జారీ.
డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను పెంచడం లో భాగంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకర్లను వారి వినియోగదారులకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సి) -ప్రొఫెషినల్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కోరింది.
డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను పెంచడం లో భాగంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకర్లను వారి వినియోగదారులకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సి) -ప్రొఫెషినల్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను జారీ చేయడం ప్రారంభించాలని కోరింది, వీటివల్లప్రభుత్వ వ్యాపార లావాదేవీలకు సంబందించి కార్డుల చెల్లింపులను విస్తరించడానికి,అని నివేదిక వెల్లడించింది.
బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్టీవ్ లకు ఒక లేఖలో, మంత్రిత్వ శాఖ NFC- ప్రారంభించబడిన లేదా కార్డులు డిజిటల్ చెల్లింపులకు సురక్షితమైనది మరియు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా,ఇది దేశంలోని డిజిటల్ లావాదేవీలను పెంచుతుంది, మరియు ఇప్పటికే మోస్ట్ పాయింట్ అఫ్ సేల్ (POS )టెర్మినల్స్ లో ఇటువంటి కార్డులను ఉపయోగించగల సౌకర్యం అందుబాటులో ఉంచామని చెప్పారు.
ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరానికి 30 బిలియన్ డిజిటల్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఉన్న కార్డులు మొదట స్వైప్ చేసి,డబ్బు ఎంట్రీ చేసాక పిన్ నమోదు చేయాలి కానీ ఈ స్పర్శరహిత కార్డులకు అవేమి అవసరం లేదు ఒకసారి ట్యాప్ చేసి టికెట్ ధర నమోదు చేస్తే చాలు చెల్లింపు సులువుగా ఐపోతుందని POS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ అగర్వాల్ చెప్పారు.
ఈ NFC-ఎనేబుల్ కార్డులను మెట్రో, రైల్వేలు, బస్సులు లాంటి వాటి కోసం ఉపయోగించవచ్చని,వీటి ద్వారా వినియోగదారులు, టికెట్ ధరలను తమ బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా చెల్లించవచ్చని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.