తిరుమల వెళ్లే భక్తులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు ఏంటో చూడండి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి శుభవార్త ఎంతో దూరం నుంచి వస్తూ చాల కష్టాలు పడుతూ శ్రీవారి కొండా మెట్లు ఎక్కుతు శ్రీ వారి దర్శనం కోసం గంటల తీరుబడి వేచిచుస్తుంటారు. కానీ ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు.
AP సర్కార్
AP సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఆఖరులో ప్రారంభంకానున్న APTDC బస్సు ఎక్కితే గంట నుంచి గంటన్నర సమయంలో స్వామివారి దర్శనం చేయిస్తాం అని ఏపి ప్రభుత్వం చెప్పింది.
విశాఖపట్నం నుండి తిరుమల
ఈ బస్సును విశాఖపట్నం నుండి తిరుమల వరకు ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
బెంగుళూరులో
ఆధునికమైన ఈ బస్సును నడిపేందుకు బెంగుళూరులో డ్రైవర్లకు ప్రతేక్య శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. తిరుపతి మరియు విశాఖ డిపోలకు బస్సులను కేటాయిస్తున్నం అని చెప్పారు.
43 సీట్లు
43 సీట్లు ఉన్న ఈ బస్సులో ఎక్కాలి అంటే ఒకొక్కరికి రూ.4000 వసూలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖలో బయలుజేరుతుంది అలాగే మరుసటి రోజు ఉదయం తిరుపతికి వెళ్తుంది.
వసతి సౌకర్యాలు
తిరుపతిలోనే యాత్రికులకు వసతి సౌకర్యాలు కలిపించి అక్కడ నుంచి మరో RTC బస్సులో కొండా పైకి తీసుకెళ్తారు. అక్కడ శ్రీవారి దర్శనం చేయించి క్రిందకి తీసుకొస్తారు.
శ్రీకాళహస్తిలో లో
అదే రోజు మధ్యాహ్నం బయలుజేరె బస్సు శ్రీకాళ హస్తిలో లో దర్శనం చేయించి మరుసటి రోజు విశాఖలో ఉంటుంది అని ఏపి ప్రభుత్వం చెప్పింది. ఈ మేరుకు తిరుమల అధికారులతో చేరించినట్లు సమాచారం.