ఎండాకాలంలో ఇలా చేస్తే మీ కరెంటు బిల్లు రూ.200 మించదు?
కాలం మారుతోంది టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. ఐతే ఏ టెక్నాలజీ పెరిగిన సరే కరెంటు మాత్రం తప్పనిసరిగా కావాలి.ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తో కరెంటు బిల్లు తడిసి మోపేడు ఐతుంటుంది.
ప్రతి ఇంట్లో
ఇంకా ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒకరికి సెల్ ఫోన్ కామన్ ఐపోయింది. దానికి తోడు wifi లు టీవీ రూటర్లు, లాప్ ట్యాప్ లు , ట్యాబ్లేట్లు ఇలా ఎటు చూసిన ఎలక్ట్రానిక్ వస్తులు కనిపిస్తుంటాయి.
వాక్యూమ్ క్లీనర్
ఇక ఇంట్లో కంప్యూటర్ ఉంటె సౌండ్ సిస్టం కచ్చితంగా ఉండాలి. వాషింగ్ మెషిన్, ఫ్యాన్ , ఏ.సి , వాక్యూమ్ క్లీనర్, ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే చాలనే ఉంటాయి.
తెలివిగా వాడితే
కానీ కరెంటును తెలివిగా వాడితే చాల వరకు ఖర్చు తగిచుకోవచ్చు. వేల నుండి వందలలోకి రావచ్చు. ఒకవేళ వందలలో ఉంటె వందతో సరిపెట్టుకోవచ్చు.
కామన్
ఈరోజుల్లో ఒక ఇంటికి కరెంటు బిల్లు కామన్ గా రూ.600 నుండి రూ.1000 వరకు వచ్చేస్తుంది. ఇక మధ్య తరగతి వారికీ ఏ.సి. ఉంటె ఎండాకాలంలో రూ.3000 నుండి రూ.4000 వరకు వస్తుంది.
చాలా సులువు
ఐతే వీటిని తగ్గించుకోవడం చాల అంటేచాలా సులువు మొదట్లో రూ.300 నుండి రూ.400 తగ్గినా పర్లేదు.ఏడాదికి రూ.3600 అవుతుంది. రూ.2000 మిగిలిన కూడా ఏ పేపర్ బిల్లుకో , పాల బిల్లుకు పనికి వస్తుందిగా .
తక్కువ పొదుపు
తక్కువ పొదుపు రేపు మనకి మరింత సేవింగ్స్ గా మనకు కనిపిస్తాయి.అందుకు మనం ఎం చేయాలో చూద్దాం.
మొబైల్ చార్జర్
ఇంట్లో మొబైల్ చార్జర్ ఒకటి వాడడం మంచిది ఒకరి తర్వాత ఒకరు ఛార్జ్ చేసుకోవడం వల్ల కరెంటు మనం ఆదా చేసుకోవచ్చు. ఎందుకుఅంటే ఛార్జర్స్ ఉన్నాయి కదా అని రూమ్ కి ఒకటి పెట్టడం వల్ల మనం వాడకపోయినా కూడా ఏడాదికి 10 శాతం మనం వాడక పోయిమా కూడా వస్తుంది వీటి వల్ల. మనం వాడడం లేదు కదా అని ప్లగ్ ఉంచి స్విచ్ ఆఫ్ చేస్తాం. ఇది కూడా తప్పే ఛార్జింగ్ ఐపోయాక తీసి వేయాలి.
టాస్క్ లైట్
ఇక చదువుకొనే వారు రూమ్ అంతా లైట్స్ వేసుకోకుండా టాస్క్ లైట్ వాడితే చాలామంచిది.
వెలుతురు ఎక్కువగా ఉంటుంది. కరెంటు కూడా చాల సేవ్ అవ్వుతుంది.
LED బల్బ్
ఇక సి ప్ బలుబులు బాగా వెలుగుతున్నాయి కదా అని వాడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఎందుకు అంటే కొత్త బల్బు కొనడానికి ఇబ్బంది పడతాం కానీ వీటి వల్ల 90 శతం అదనంగా బిల్లు వస్తుంది. ఏవి ఉంటె దీని ప్లేస్ లో LED బల్బ్ మార్చడం మంచిది
షట్ డౌన్
ఇక ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి ముఖ్య కారణం డెస్క్ టాప్ మరియు లాప్ ట్యాప్ వీటిని అవసరం ఉంటేనే వాడాలి పక్కకు వెళ్లిన సరే షట్ డౌన్ చేసి వెళ్ళాలి. ఒక 5 నుండి పది నిముషాలు అంటే సరే అదే దీనికికన్నా ఎక్కువ ఉంటె మాత్రం కచ్చితంగా షట్ డౌన్ చేసి స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకుఅంటే ఈ నిమిషాలే కౌంట్ అయి నెలకి 150 నిముషాలు అంతా కంటే ఎక్కువ నెలకి 5 యూనిట్లు ఎక్కువ వస్తుంది.ఇలా 5 ఎలక్ట్రానిక్ వస్తులు వాడితే చాలు నెలకి రూ.300 ఎక్సట్రా బిల్లు కట్టాల్సి వస్తుంది.
వెంటిలేషన్
ఇక వెంటిలేషన్ వాడుకోవడం అనేది చాల ముఖ్యమైనది ప్రకృతి పరమైన లైట్ ఇంట్లోకి వస్తే నీట్ గా ఎలాంటి వాసనా రాకుండా ఉంటుంది.
ఆఫీస్
ఇక ఉదయం ఆఫీస్ లకు వెళ్లే వాళ్ళు వేడినీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. సందర్భాన్ని బట్టి చల్ల నీటి స్నానం చేయండి, ఇది ఆరోగ్యానికి కూడా చాల మంచిది.అలాగే హీటర్స్ ని పెట్టి వదిలేయకుండా ఆన్ అండ్ ఆఫ్ చూసుకోండి.
ఐరన్
ఇక ఇంట్లో ఐరన్ చేసుకుంటే ఒకేసారి అన్ని బట్టలు ఐరన్ చేసుకోవడం వల్ల కరెంటు ఆదా అవుతుంది.
వాషింగ్ మిషిన్
ఇక వారం వారం బట్టలు ఉత్తుకోవడం కోసం మనం వాషింగ్ మెషిన్ వాడుతాం. ఇది తక్కువ లోడ్ వేసుకుంటే మంచిది. చాల నీటితో ఉతకడం అవసరం. ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మీ కరెంటు బిల్లు ఆదా చేసుకోవచ్చు.
సిల్లీగా
ఇవ్వని క్రమం తప్పకుండ పాటిస్తే మీ జేబులో ఉన్న డబ్బును కాపాడతాయి వీడిగా చూస్తే ఇవ్వని చల్ సిల్లీగా ఉంటాయి.ఈరోజు మిగిలిన రూ.10 రూపాయిలు నెల అయేవరకు రూ .500 నుండి రూ.1000 వరకు మీరు ఆదా చేసుకోవచ్చు.
కరెంటు బిల్లు
ఇవి అని మనం ఆదా చేసుకునేది ఇవి కాకుండా కరెంటు బిల్లులో కూడా చిన్న మతలబు ఉంది.ఐతే ఇది అందరికి తెలిసిన కూడా చాలామంది పట్టించుకోరు.
హైదరాబాద్
ఇక్కడ మనకు వేరు వేరు స్లాప్స్ ఉన్నాయి ఉదాహరణకు హైదరాబాద్ లో ఇంటి కరెంటు బిల్లులో స్లాప్స్ చూస్తే మొదటి 50 యూనిట్స్ వరకు రూ.1.45 పైసలు మాత్రమే. ఈ స్లాప్స్ లో ఉండే వారు చాల తక్కువ మంది.
చిన్న ఇల్లు
ఈరోజుల్లో చాల చిన్న ఇల్లు ఉన్న కూడా కరెంటు బిల్లు 51 యూనిట్ల నుండి 100 వరకు వాడుతున్నారు. దీనికి కట్టలసింది రూ.2 .60 పైసలు మధ్య తరగతి కుటుంబం వారు చలికాలం కరెంటు బిల్లు తగ్గించినా లాగా చేసుకోవచ్చు.
ఎగువ మధ్య తరగతి
ఎగువ మధ్య తరగతి వారు 200 యూనిట్ల వాడకం వాడుతారు అందుకీ వారికీ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది, అలాగే వారు ఒక 200 యూనిట్లకు రూ.4 .౩౦ పైసలు. ఇక్కడే ఎక్కువ బిల్లు రావడానికి అసలు కారణం. ముక్యంగా మీరు చేయాలసింది ఒక ౨౦ రోజులు యూనిట్లు రాసుకోవాలి. అనవసరంగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు.