పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ కొత్త ఇ-కామర్స్ ప్లాట్ఫాం, ద్వారా మందికి పతంజలి ఉత్పత్తులు చేరుకోవటానికి కంపెనీ సహాయం చేస్తుందని వెల్లడించారు.
2016 -17 లో పతంజలి రూ:10 ,500 కోట్లు ఆర్జించి, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు వృద్ధిని సాధించింది.

యోగ గురువు రాందేవ్ బాబా తన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను నేరుగా వినియోగదారునికి చేరేలా ఇ-కామర్స్ కార్యకలాపాలను అధికారికంగా ప్రవేశపెట్టాడు.ఇందుకుగాను అమెజాన్, ఫ్లిప్కార్ట్,పెటియం, బిగ్బాస్కేట్ మరియు గ్రోఫర్స్ వంటి ప్లోటీఫోర్మ్స్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఈ-రీటైలర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.హరిద్వార్ లో తయారైయ్యే పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు ప్రతి గడపకి చేరాలనే ఉద్దెశంతో ఈ-కామర్స్ ప్లాట్ఫాం www.patanjaliayurved.net ప్రవేశపెట్టామని,ఇది మొదటి ట్రయిల్ దశలో మంచి స్పందన లభించిందని తెలిపారు.ఆన్లైన్ అమ్మకాల విలువ డిసెంబర్లో 10 కోట్లు దాటేసింది.
సాంప్రదాయ రిటైల్ మార్కెటింగ్ తో పటు ఆన్లైన్ అన్నకాల కారణంగా వినియోగదారుడికి సమర్తవంతమైన,సౌకర్యవంతమైన కొనుగోలు అవకాశం లభిస్తుందని రామ్దేవ్ అన్నారు.
పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ కొత్త ఇ-కామర్స్ ప్లాట్ఫాం, ద్వారా మందికి పతంజలి ఉత్పత్తులు చేరుకోవటానికి కంపెనీ సహాయం చేస్తుందని . ఇది "కొనుగోలు పాయింట్ యాక్సెస్ లేని వారికి కూడా నేరుగా ఇంటికి చేరే విదంగా దోహదపడుతుందని వెల్లడించారు.
సంస్థ చెప్పిన ప్రకారం పతంజలి FMCG (ఎఫ్ఎంసిజి)రంగం లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం రూ. 50,000 కోట్లు సాధించిందని చెప్పారు.
అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కేటగిరి యాజమాన్యం) మనీష్ తివారీ మాట్లాడుతూ తాము పతంజలితో భాగస్వామయంగా ఉన్నామని , దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ ఉత్పత్తులను సులభంగా అందించగలమని, భారతీయ బ్రాండ్లు సంతోషకరమైన ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని కలిపి వినియోగదారులకి ప్రత్యేకమైన ఉత్పత్తులను అందించటమే లక్ష్యం అని పేర్కొన్నారు.
ఎఫ్ఎంసిజి సెగ్మెంట్తో పాటు, పతంజలి ఆయుర్వేద విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ఇతర రంగాలలో కూడా ఉందని , గత నెలలో ఇది సౌర సామగ్రి తయారీలోకి అడుగుపెట్టినదని వెల్లడించారు.
ఈ ఏడాది పతంజలి ఆయుర్వేద విభాగం 1,000 కోట్ల ఆదాయాన్ని లక్శ్యంగా పెట్టుకుంది


Click it and Unblock the Notifications