కొంత మంది టెక్నాలజీతో పాటు వేగంగా పరుగులెడుతూ ఎన్నో సరికొత్త ఐడియాలను ప్రయత్నిస్తుంటారు. అయితే 23 ఏళ్ల త్రిష్ణీత్ అరోరా మాత్రం అలా కాదు. తన ఒక్క ఆలోచనతో సొంత వ్యాపారాన్నే నెలకొల్పాడు. అతని
సాధారణంగా 22,23 ఏళ్లకు ఈ తరం యువకులు ఏ విధంగా స్థిరపడాలి అని ఆలోచిస్తుంటారు. చాలా మంది ఏ రంగం ఎంచుకుంటే భవిష్యత్తు ఉంటుందని యోచిస్తుంటారు. టెక్నాలజీతో పాటు వేగంగా పరుగులెడుతూ ఎన్నో సరికొత్త ఐడియాలను ప్రయత్నిస్తుంటారు. అయితే 23 ఏళ్ల త్రిష్ణీత్ అరోరా మాత్రం అలా కాదు. తన ఒక్క ఆలోచనతో సొంత వ్యాపారాన్నే నెలకొల్పాడు. అతని గురించి మరిన్ని విశేషాలు మీ కోసం...

1.త్రిష్ణీత్ అరోరా
త్రీష్ణీత్ అరోరా 1993లో నవంబరు 2న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. స్వతాహాగా రచయిత అయిన ఇతను ఒక వ్యవస్థాపకుడు, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు కూడాను. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, వెబ్ డిఫెన్స్ కు సంబంధించి పలు పుస్తకాలు రాశాడు.

2. కెరీర్
అరోరా 2012 నుంచే తన కెరీర్ను నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా భద్రతపై నిర్మించుకున్నాడు. చిన్న వయసులోనే టీఏసీ సెక్యూరిటీ పేరిట సొంత బిజినెస్ను ప్రారంభించాడు. ఈ కంపెనీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. డేటా భద్రత విషయాలకు సంబంధించిన వ్యవహారాలను చూడటం ఈ కంపెనీ వ్యాపకం.

3.ఏఏ సంస్థలకు సేవలు అందిస్తున్నాడు...
తన కంపెనీ ద్వారా అరోరా రిలయన్స్ ఇండస్ట్రీస్, సీబీఐ, పంజాబ్ పోలీస్(ఇండియా), గుజరాత్ పోలీసులకు తన సేవలను అందిస్తున్నాడు. సైబర్ క్రైమ్ దర్యాప్తులకు సంబంధించి గుజరాత్; పంజాబ్ పోలీసులకు సాయం చేస్తున్నాడు. అందుకోసం పోలీసులకు, అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటాడు.

4. త్రీష్ణీత్ బ్యాక్ గ్రౌండ్
త్రిష్ణీత్ అరోరా 8వ తరగతిలోనే పాఠశాల చదువును వదిలేశాడు. స్వయంగా చదువుకున్నాడు. తన తండ్రి కంప్యూటర్లో వీడియోలు చూసుకుంటూ ప్రయోగాత్మక విద్యను అభ్యసించాడు. దూరవిద్యలో చదువుకుంటూ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్(బీసీఏ) చదివాడు. ప్రస్తుతం లూథియానా ప్రధాన కేంద్రంగా వ్యాపారం చేస్తున్నాడు. ఇంకా దుబాయి, యూకేలలో వర్చువల్ ఆఫీసుల్లో క్లైంట్ల ద్వారా తన సేవలను విస్తరిస్తున్నాడు.

5. అతని ప్రతిభకు గుర్తింపు
2013లో గుజరాత్లో జరిగిన బిజినెస్ రిలేషన్ కాన్ఫరెన్స్లో మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాతో వేదికను పంచుకున్నాడు.
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ 65వ స్వాతంత్ర దినం సందర్భంగా రాష్ట్ర అవార్డుతో సత్కరించారు.
2015లో పంజాబ్ ఐకాన్ అవార్డ్ను పీసీహెచ్బీ అందించింది.
2017లో ఆకాష్ అంబానీ, విజయ్ శేఖర్ శర్మ, రణ్వీర్ సింగ్; ప్రభాస్ వంటి వాళ్ల సరసన చేరాడు. వీళ్లంతా జర్మనీకి చెందిన ఒక ప్రముఖ మ్యాగజైన్ చేత 50 ప్రభావవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

భారతదేశంలో 10 అతిపెద్ద ఆర్థిక మోసాలు

సంప్రదాయ పాలసీలు: బీమా ఏజెంట్లు చెప్పని 7 ముఖ్యమైన అంశాలివే!

కోట్ల విలువ చేసే పతంజలి వెనుక ఒకే ఒక్కడు.. ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటో...

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు ఎలా?

బంగారం ధర మారేందుకు కారణమయ్యే 10 అంశాలు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications