ప్రత్యక్ష నగదు బదిలీకి 3000 రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు
అన్ని ప్రభుత్వ పథకాల లబ్ది, అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం లేదా స్థానిక ప్రభుత్వాలు దేనికి సంబంధించిందైనా నగదు బదిలీ విధానంలోకి తీసుకొచ్చి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తారు.
ప్రత్యక్ష నగదు బదిలీకి మరింత ప్రాధాన్యత కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలను సైతం దీని పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం పని చేస్తోంది. "అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాతో పనిచేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష నగదు బదిలీ పరిధిలోకి తీసుకువస్తాం" అని కేంద్ర ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. నగదు బదిలీ విధానంలోకి దాదాపుగా 3000 రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, 40 వేల కార్యాలయాలు, 3 లక్షల కోట్ల నిధులు రాగలవు. అన్ని ప్రభుత్వ పథకాల లబ్ది, అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం లేదా స్థానిక ప్రభుత్వాలు దేనికి సంబంధించిందైనా నగదు బదిలీ విధానంలోకి తీసుకొచ్చి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిస్తే దాదాపు 6 లక్షల కోట్ల లబ్దిదారుల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతుంది.
ప్రస్తుతానికి 76.38 కోట్ల లబ్దిదారులను కవర్ చేస్తూ 370 కేంద్ర ప్రాయోజిత పథకాలను 55 కేంద్ర మంత్రిత్వ శాఖలు నగదు బదిలీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కేంద్రం అమలు చేసే పథకాలకు సంబంధించే దాదాపు రూ.39,623 కోట్లను ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ చేశారు. ఇప్పటి వరకూ నగదు బదిలీ పథకం ప్రారంభం నుంచి మొత్తంగా రూ.2.22 లక్షల కోట్లను ఖర్చు చేశారు.