For Quick Alerts
For Daily Alerts
కాల్ డ్రాప్స్పై పెనాల్టీ గరిష్టంగా రూ.10 లక్షల వరకూ
నియంత్రణ సంస్థ సూచించిన ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే ఏమి చేయాలనే దానిపై ట్రాయ్ కఠినమైన నిబంధనలు రూపొందించింది. ఇందులో గరిష్టంగా రూ.10 లక్షల పెనాల్టీ అనే అంశం కూడా ఉంది.
|
వినియోగదారులు చేసే కాల్స్ మధ్యలో డ్రాప్ అయితే టెలికాం కంపెనీలు ఇకపై భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. వరుసగా మూడు త్రైమాసికాల్లో టెలికాం నియంత్రణ సంస్థ సూచించిన ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే ఏమి చేయాలనే దానిపై ట్రాయ్ కఠినమైన నిబంధనలు రూపొందించింది. ఇందులో గరిష్టంగా రూ.10 లక్షల పెనాల్టీ అనే అంశం కూడా ఉంది.
కాల్ డ్రాప్స్ నివారించడంలో విఫలమైతే మొదటిసారి రూ.5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని, ఇదే పద్దతి కొనసాగితే జరిమానాను రూ.10 లక్షలకు పెంచుతామని ట్రాయ్ కార్యదర్శి ఎస్కే గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం కాల్ డ్రాప్స్పై రూ.50 వేల పెనాల్టీ విధిస్తున్నారు. ఆయా నెట్వర్క్ల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాలను నిర్దేశిస్తామని ట్రాయ్ వర్గాలు తెలిపాయి.
Comments
English summary
కాల్ డ్రాప్స్పై పెనాల్టీ గరిష్టంగా రూ.10 లక్షల వరకూ | Penalty upto 10 Lakhs on call drops if a company fails to tackle
Story first published: Saturday, August 19, 2017, 11:00 [IST]