For Quick Alerts
For Daily Alerts
భూరికార్డులు సైతం ఆధార్తో అనుసంధానం!
భూమి సొంతదారులకు సంబంధించి 1950ల నుంచి ఉన్న అన్ని భూమి రికార్డులను ఆధార్తో అనుసంధానించేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థిరాస్తులకు సంబంధించిన ల్యాండ్ రికార్డులను డిజిటలీకర
|
భూమి సొంతదారులకు సంబంధించి 1950ల నుంచి ఉన్న అన్ని భూమి రికార్డులను ఆధార్తో అనుసంధానించేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థిరాస్తులకు సంబంధించిన ల్యాండ్ రికార్డులను డిజిటలీకరణ చేయాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బినామీ లావాదేవీల(నిషేధ) సవరణ చట్టం ప్రకారం ఆన్లైన్ భూరికార్డులను సొంత దారుల ఆధార్ నంబర్లతో లింక్ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి జూన్ 15న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తూ ఒక లేఖ రాశారు. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య అధికారులు, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్, నీతి ఆయోగ్ కార్యదర్శికి సైతం సమాచారం అందించారు. లేఖలో 1950 నుంచి ఉన్న భూ రికార్డులను ఆన్లైన్లో ఎక్కించాలని, అంతే కాకుండా ఆ స్థిరాస్తి సొంత దారుల ఆధార్ నంబర్లను సదరు ఆస్తులతో అనుసంధానించాలని స్పష్టంగా కోరినట్లు తెలుస్తోంది.
Comments
English summary
భూరికార్డులు సైతం ఆధార్తో అనుసంధానం! | Link your land records with Aadhaar, else face action under Benami Act
Story first published: Monday, June 19, 2017, 15:17 [IST]