జీఎస్టీ నుంచి దేశానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?
భారతదేశంలో మొత్తం పరోక్ష పన్నులు తొలగిపోయి ఏకరీతి పన్ను సాధ్యమవుతుంది. అనేక రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులకు ఒకే పన్ను కిందకు చేర్చి, ముందస్తు పన్ను సెటాఫ్కు అనుమతించడం వల్ల పన్ను
భారతదేశంలో మొత్తం పరోక్ష పన్నులు తొలగిపోయి ఏకరీతి పన్ను సాధ్యమవుతుంది. అనేక రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులకు ఒకే పన్ను కిందకు చేర్చి, ముందస్తు పన్ను సెటాఫ్కు అనుమతించడం వల్ల పన్ను మీద పన్ను పోటు లేకుండా చేసుకోవచ్చు. అలాగే ఒక ఉమ్మడి జాతీయ మార్కెట్ ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది.
వినియోగదారులకు దీనివల్ల ఒనగూరే అతి పెద్ద లబ్ది ఏమిటంటే సరుకులపై పన్ను భారం తగ్గిపోవడం జరుగుతుందని భావిస్తున్నారు. అయితే అంతిమంగా కంపెనీలు తమకు లభించే పన్ను ప్రయోజనాలు బదలాయిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం వస్తువులపై పన్ను భారం 25 నుంచి 30% మధ్య ఉంటుంది. ఇది కొంత వరకూ తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల స్వదేశీ, విదేశీ మార్కెట్లలో మన ఉత్పత్తులకు పోటీతత్వం సమకూరుతుంది. ఇది ఆర్థిక వృద్దికి దారితీస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పన్ను పరిధి, వాణిజ్య వస్తువుల వినిమయం పెరగడం, మెరుగైన పన్ను చెల్లింపుల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా పెరుగుతుంది. అంతిమంగా పారదర్శక లక్షణాల కారణంగా ఈ పన్ను అమలు సులభతరంగా ఉంటుంది.