For Quick Alerts
For Daily Alerts
రైతులకు స్వల్పకాలిక రుణాలకు వడ్డీ రాయితీ
రైతులు రూ.3 లక్షల లోపు తీసుకునే స్వల్పకాలిక రుణాలకు 7% వడ్డీ రేటు కొనసాగనుంది. అదే గడువుకు లోపు రుణాలు చెల్లించే వారికి 4% వడ్డీకి రుణాలు అందనున్నాయి. ఎందుకంటే 2017-18 సంవత్సరానికి కేంద్ర
|
రైతులు రూ.3 లక్షల లోపు తీసుకునే స్వల్పకాలిక రుణాలకు 7% వడ్డీ రేటు కొనసాగనుంది. అదే గడువుకు లోపు రుణాలు చెల్లించే వారికి 4% వడ్డీకి రుణాలు అందనున్నాయి. ఎందుకంటే 2017-18 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలపై సబ్సిడీ రేట్లను ప్రకటించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి వడ్డీ రాయితీ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్రం ఈ ఏడాది రూ.20,339 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
సకాలంలో రుణం చెల్లించే రైతులకు రూ.3 లక్షల లోపు వాటిపై 4% వడ్డీ అమలు అవుతుంది. ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ సైతం స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీలను ఇవ్వాల్సిందిగా బ్యాంకులను కోరింది. ఒక పక్క రైతులు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు మధ్యప్రదేశ్ రైతు రుణాలను మాఫీ చేసే విధంగా రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. 2017-18 సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17లో ఇది రూ.9 లక్షల కోట్లుగా ఉంది.
Comments
English summary
రైతులకు స్వల్పకాలిక రుణాలకు వడ్డీ రాయితీ | The Interest Subvention Scheme for 2017-18 has been approved in the Cabinet meeting
Story first published: Thursday, June 15, 2017, 11:38 [IST]