ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద ఆదాయం వెల్లడికి సంబంధించిన విధివిధానాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు లెక్కలు చూపని ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేస్తే దాన్ని సక్రమమైనదిగా
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద ఆదాయం వెల్లడికి సంబంధించిన విధివిధానాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు లెక్కలు చూపని ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేస్తే దాన్ని సక్రమమైనదిగా చూపించుకోవడం కోసం ఈ క్షమాభిక్ష పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇందు కోసం రెండు పేజీల ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. సాధారణ సమాచారమే ఇవ్వాల్సి ఉంటుంది.
రూ.500, రూ.1000 జమ చేసిన బ్యాంకు/తపాలా కార్యాలయం ఖాతా వివరాలు ఇవ్వాలి.
ఈ సొమ్ము ఏ ఆదాయ మార్గం ద్వారా వచ్చిందో అడగబోరు. తర్వాత ప్రభుత్వం నుంచి వేదింపులు ఉండవు.
నల్లధనం కలిగిన వారు స్వచ్చందంగా డిక్లేర్ చేస్తే రెండింతల పన్నును తప్పించుకోవచ్చు.
దీని గురించి కూడా చదవండి ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో సొంత ఇల్లు
పథకం గురించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్వయంగా వెల్లడిస్తే(డిక్లేర్ చేస్తే)
ఇదివరకే డిపాజిట్ చేసిన పాత రూ. 500, రూ. 1000 నోట్ల గురించి వెల్డించాలి
30% పన్ను+ 10% పెనాల్టీ + 10% సర్చార్జీ = మొత్తం 50% పన్ను
అయితే ఇందులో 25% సొమ్మును పీఎంజీకేవై కింద బ్యాంకు ఖాతాలో వడ్డీ లేకుండా నాలుగేళ్ల
పాటు ఉంచుతారు. తర్వాత వెనక్కు ఇస్తారు. డిసెంబరు 16న ప్రభుత్వ నోటిఫికేషన్

స్వయంగా వెల్లడించకుండ, ప్రభుత్వానికి పట్టుబడితే
ఏకమొత్తంలో 60% పన్ను + 15% సర్చార్జీ = మొత్తం 75%
తర్వాత 75% పన్నుకు అదనంగా అసెసింగ్ ఆఫీసర్ విచక్షణ మేరకు 10% పెనాల్టీ కూడా ఉండొచ్చు.
కాబట్టి స్వయంగా వెల్లడించకపోతే దాదాపు 85% వరకూ పన్ను,పెనాల్టీ, సర్చార్జీ రూపంలో పోతుంది.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 270ఏ కింద 200% పన్ను సైతం విధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications