ఏప్రిల్ 1 నుంచి పెద్ద మొత్తాల్లో జరిగే లావాదేవీలు, నగదు రూపంలో జరిగే చెల్లింపులను ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది. ఇందులో నగదు రసీదులు, క్యాష్ విత్డ్రాయల్స్, షేర్ల కొనుగోలు, స్థిరాస్తి లావాదేవీలు, టర్మ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫారిన్ కరెన్సీ అమ్మకం వంటివి ఉన్నాయి.
ఒక నిర్ణీత ఫార్మట్లో వీటిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నివేదిస్తారు. ప్రతి వ్యక్తీ రిటర్నులను ఫైల్ చేసేటప్పుడు
అధిక మొత్తంలో జరిపిన లావాదేవీలన్నింటినీ నివేదించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఆస్కారం ఉన్న లావాదేవీలను ఇక్కడ చూద్దాం.

స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు
రూ. 30 లక్షలకు మించి విలువ కలిగిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం సంబంధిత లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేస్తారు.

వృత్తి నిపుణులు
వృత్తి నిపుణులు సాధారణంగా నగదు రూపంలోనే లావాదేవీలు జరుపుతూ ఉంటారు. రూ. 2 లక్షలకు పైబడి వస్తు, సేవలకు సంబంధించి తీసుకునే రుసుములను, జరిపే నగదు లావాదేవీలను వృత్తి నిపుణులు ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించాలి.

బ్యాంకు నగదు డిపాజిట్లు
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో ఒక వ్యక్తి రూ. 10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఏడాది కాలంలో డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియపరచాలి.

టర్మ్ డిపాజిట్లు
ఒక వ్యక్తి బ్యాంకు టర్మ్ డిపాజిట్లలో ఏడాది కాలంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డబ్బు పొదుపు చేసి ఉంటే బ్యాంకులు ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. వీటిలో పోస్టాఫీసు ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, విత్డ్రాయల్స్ సైతం ఉంటాయి.

కరెంట్ ఖాతా డిపాజిట్లు
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షలకు మించి చేసే నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వివరాలను ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తుంది. ప్రతి లావాదేవీని స్వచ్చందంగా తెలియజేస్తే నోటీసులు వచ్చే ఇబ్బందులు తప్పుతాయి.

బ్యాంకు డ్రాఫ్ట్లు
బ్యాంకు డ్రాఫ్ట్ లేదా ఏదైనా ఆర్బీఐ జారీ చేసే ప్రీపెయిడ్ నగదు సాధనం కొనుగోలు కోసం రూ. 10 లక్షలు వెచ్చించి ఉంటే ఆ వివరాలు ఆదాయపు పన్ను శాఖకు బ్యాంకు ద్వారా వెళతాయి.

ఫైనాన్సియల్ సెక్యూరిటీస్
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలో రూ. 10 లక్షలకు మించి పెట్టుబడులు పెట్టి ఉంటే ఆయా కంపెనీలు ఆ లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంది.

క్రెడిట్ కార్డు చెల్లింపు
రూ. 2 లక్షలకు మించి చేసే క్రెడిట్ కార్డు చెల్లింపు వివరాలు ఆదాయపు పన్ను శాఖకు నివేదించబడతాయి.

బంగారు ఈటీఎఫ్లు
బంగారు ఈటీఎఫ్ల్లో ఒక వ్యక్తి రూ. 1 లక్షకు మించి చేసే పెట్టుబడి వివరాలు ఆదాయపు పన్ను శాఖకు దృష్టికి వెళతాయి.

మ్యూచువల్ ఫండ్లు, షేర్లు
రూ. 2 లక్షలకు మించి ఒక పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్లు యూనిట్లను కొనుగోలు చేస్తే పన్ను రిటర్నులను ఫైల్ చేసేటప్పుడు ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించాలి. కంపెనీలే ఈక్విటీ షేర్లలో రూ. లక్షకు మించి పెట్టుబడులను ఆదాయపు పన్ను శాఖకు వెల్లడిస్తాయి.
ఆదాయపు పన్ను శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ఫైలింగ్లో 61ఏ ఫారం ద్వారా అధిక విలువ కలిగిన లావాదేవీలను తెలియజేసయాల్సి ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications