న్యూఢిల్లీ: విధుల్లో నిర్లక్ష్యం వహించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. పనితీరుకు సంబంధించి నిర్దేశిత ప్రమాణాలను చేరుకొని ఉద్యోగులకు వార్షిక వేతన పెంపుదలను (ఇంక్రిమెంట్లు) అమలు చేయకూడదని ఏడో వేతన సంఘం సిఫారసు చేసింది.
కేంద్ర ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగులందరికీ పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని వేతన సంఘం సిఫారుసు చేసింది. తొలి 20 ఏళ్ల సర్వీసులో ఎంఏసీపీ, లేదా పదోన్నతిని పొందేందుకు అవసరమైన స్థాయిని కనబరచకపోతే వారి ఇంక్రిమెంట్లను నిలిపివేయాలని సూచించింది.

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు
పని చేయకపోయినా ఇంక్రిమెంట్లు, పదోన్నతులు యథాలాపంగా వచ్చేస్తాయన్న అవగాహన పాతుకుపోయిందని, దీనిని మార్చాల్సి ఉందని పేర్కొంది. అలాగే అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రదర్శన ఆధారిత వేతనం (పీఆర్పీ) పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది.

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు
పదోన్నతుల్లానే వేతనం కూడా క్రమానుగుణంగా పెరగాలని పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలను అందుకోని ఉద్యోగులు భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు అందుకోకుండా నిరోధించాలని కమిషన్ అభిప్రాయపడుతున్నట్టు తెలిపింది. తొలి 20 ఏళ్ల సర్వీసులో సాధారణ పదోన్నతుల నుంచి కూడా వారిని మినహాయించాలని సూచించింది.

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు
కేవలం ఇది ప్రదర్శనకు సంబంధించిన అంశమే కనుక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకొనే నిర్ణయాలకు ఇది వర్తించదని తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సదరు ఉద్యోగులు కావాలంటే స్వచ్ఛంద పదవీ విరమణ నియమనిబంధనల ప్రకారం ఉద్యోగం వదిలేయవచ్చని పేర్కొంది.
పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు
ఈ నిబంధనలు ఉద్యోగుల్లో మార్పు కోసమేనని కమిషన్ అభిప్రాయపడింది. వీటన్నింటితోపాటు ఎంఏసీపీ ఇచ్చే ముందు డిపార్ట్మెంటల్ పరీక్షల వంటి వాటిల్లో కచ్చితమైన పద్ధతిని తీసుకురావాలని సూచించింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫారసులను సానుకూల దృష్టితో అధ్యయనం చేస్తామని, ఆ తరువాతనే తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చెప్పారు.

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు
ఏడో వేతన సంఘం సిఫారసులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధులకు కోత పెట్టాల్సి వస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ డేబ్రాయ్ అన్నారు. కమిషన్ సిఫారసులను కేంద్రం అమలు చేయగానే, రాష్ర్టాలు సైతం తమ ఉద్యోగుల వేతనాలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications