హైదరాబాద్: సుమారు 60 ఏళ్ల పాటు చిత్తూరుకు పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. కంపెనీ లాకౌట్ దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్యాక్టరీని నడపలేమని యాజమాన్యం సిబ్బందికి నోటీసు జారీ చేసింది.
దీంతో బుధవారం ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన కార్మికులు, ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం ఓ నోటీసు జారీ చేసింది.
అందులో కంపెనీ నెలసరి ఉత్పత్తి నాలుగు వేల టన్నుల నుంచి 400 టన్నులకు పడిపోయిందని, కంపెనీ తిరిగి లాభాల బాట పట్టేందుకు 15 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. దీనిపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో సెప్టెంబర్ 18వ తేదీన మరో నోటీసు జారీ చేసింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమని, అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఫ్యాక్టరీని నడిపే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న 295 మంది ఉద్యోగులు, కార్మికులను పిలిపించి సీనియారిటీ ఆధారంగా బెనిఫిట్స్ చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
1952లో న్యూట్రిన్ ఫ్యాక్టరీని చిత్తూరు జిల్లాకు చెందిన బివి రెడ్డి ప్రారంభించారు. 1964లో బివి రెడ్డి మరణించారు. ఆయన మరణంతో కుమారుడు ద్వారక నాథరెడ్డి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక రంగంవైపు ఆసక్తి చూపడంతో తన అన్న కుమారుడు విక్రమ్రెడ్డికి కంపెనీ అప్పగించారు.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
ఆయన నేతృత్వంలో కంపెనీ రూ.150 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. బిస్కట్లు, టాఫీలు, క్యాండీలు, గమ్స్, హనీఫాబ్, నాచురోఫుడ్ బార్ ఇలా 40 రకాల ఉత్పత్తులతో 3,000 మంది ఉద్యోగులు, కార్మికులతో చాక్లెట్ల తయారీలో అగ్రగామిగా ఆవిర్భవించింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
ఆ తర్వాత 2004లో న్యూట్రిన్ ఫ్యాక్టరీని బివి రెడ్డి కుటుంబం నుంచి గోద్రెజ్ కొనుగోలు చేసింది. 2007లో గోద్రెజ్ నుంచి హెర్షీస్ యాజమాన్యం చేతికి వెళ్లింది. ఇటీవల నష్టాలకు గురైన కంపెనీ క్రమంగా ఒక్కో ఉత్పత్తినీ ఆపేస్తూ వచ్చింది. ఐటిసి పోటీని తట్టుకోలేకే కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని యాజమాన్యం చెబుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications