హైదరాబాద్: సుమారు 60 ఏళ్ల పాటు చిత్తూరుకు పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. కంపెనీ లాకౌట్ దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్యాక్టరీని నడపలేమని యాజమాన్యం సిబ్బందికి నోటీసు జారీ చేసింది.
దీంతో బుధవారం ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన కార్మికులు, ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం ఓ నోటీసు జారీ చేసింది.
అందులో కంపెనీ నెలసరి ఉత్పత్తి నాలుగు వేల టన్నుల నుంచి 400 టన్నులకు పడిపోయిందని, కంపెనీ తిరిగి లాభాల బాట పట్టేందుకు 15 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. దీనిపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో సెప్టెంబర్ 18వ తేదీన మరో నోటీసు జారీ చేసింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమని, అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఫ్యాక్టరీని నడిపే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న 295 మంది ఉద్యోగులు, కార్మికులను పిలిపించి సీనియారిటీ ఆధారంగా బెనిఫిట్స్ చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
1952లో న్యూట్రిన్ ఫ్యాక్టరీని చిత్తూరు జిల్లాకు చెందిన బివి రెడ్డి ప్రారంభించారు. 1964లో బివి రెడ్డి మరణించారు. ఆయన మరణంతో కుమారుడు ద్వారక నాథరెడ్డి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక రంగంవైపు ఆసక్తి చూపడంతో తన అన్న కుమారుడు విక్రమ్రెడ్డికి కంపెనీ అప్పగించారు.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
ఆయన నేతృత్వంలో కంపెనీ రూ.150 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. బిస్కట్లు, టాఫీలు, క్యాండీలు, గమ్స్, హనీఫాబ్, నాచురోఫుడ్ బార్ ఇలా 40 రకాల ఉత్పత్తులతో 3,000 మంది ఉద్యోగులు, కార్మికులతో చాక్లెట్ల తయారీలో అగ్రగామిగా ఆవిర్భవించింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ
ఆ తర్వాత 2004లో న్యూట్రిన్ ఫ్యాక్టరీని బివి రెడ్డి కుటుంబం నుంచి గోద్రెజ్ కొనుగోలు చేసింది. 2007లో గోద్రెజ్ నుంచి హెర్షీస్ యాజమాన్యం చేతికి వెళ్లింది. ఇటీవల నష్టాలకు గురైన కంపెనీ క్రమంగా ఒక్కో ఉత్పత్తినీ ఆపేస్తూ వచ్చింది. ఐటిసి పోటీని తట్టుకోలేకే కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని యాజమాన్యం చెబుతోంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications