ప్రపంచ దేశాల్లో అతి తక్కువ జీతం చెల్లించే ఐటీ యాజమాన్యాల జాబితాలో భారతీయ ఐటీ కంపెనీలు ఉన్నాయని ఓ సర్వే వెల్లడించింది. అతి తక్కువ జీతం చెల్లిస్తున్న దేశాల జాబితాలో భారత్కు 7వ స్ధానం లభించింది. ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంస్థ మైహైరింగ్.కామ్ ప్రపంచ వ్యాప్తంగా ఓ సర్వేని నిర్వహించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ జీతాలు 2015 పేరుతో నివేదికను విడుదల చేసింది. 40 దేశాల్లోని 9,413 ఐటీ ఉద్యోగులు అందుకున్న వేతన వివరాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు. ఈ సర్వే ప్రకారం భారతీయ ఐటీ కంపెనీల్లో మధ్యస్థాయి మేనేజర్కు లభించే వేతనం 41,213 డాలర్లుగా ఉండగా స్విస్లో సాఫ్ట్వేర్ మేనేజర్లు ఇందుకు 4 రెట్ల అధిక జీతం అందుకుంటున్నారు.

భారత్లో ఐటీ వేతనాలు చాలా తక్కువ
ఐటీ సిబ్బందికి ఆకర్షణీయమైన జీతాలు చెల్లిస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఐటీ ఉద్యోగి సగటు వార్షిక జీతం 1.71 లక్షల డాలర్లుగా ఉంది. ఇక 1.52 లక్షల డాలర్లకు పైగా చెల్లిస్తున్న బెల్జియం రెండో స్థానంలో ఉంది.

భారత్లో ఐటీ వేతనాలు చాలా తక్కువ
ఈ విషయంలో డెన్మార్క్(1.39 లక్షల డాలర్లు) మూడో స్థానంలో, అమెరికా(1.33 లక్షల డాలర్లు), బ్రిటన్(1.29 లక్షల డాలర్లు) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఇక అతి తక్కువ జీతం చెల్లిస్తున్న దేశాల జాబితాలో బల్గేరియా ఐటీ కంపెనీలు మొదటి స్థానంలో ఉన్నాయి.

భారత్లో ఐటీ వేతనాలు చాలా తక్కువ
అక్కడి సంస్థల్లో ఐటీ మేనేజర్ల సరాసరి జీతం 25,680 డాలర్లుగా ఉంది. వియత్నాంలోని సాఫ్ట్వేర్ సంస్థలు మధ్యస్థాయి మేనేజర్కు సరాసరిగా 30,938 డాలర్ల వేతనం చెల్లిస్తున్నాయి. ఇక థాయ్లాండ్లో ఈ మొత్తం 34, 423 డాలర్లుగా ఉంది.

భారత్లో ఐటీ వేతనాలు చాలా తక్కువ
మన పక్క దేశమైన చైనా మనకంటే కాస్తంత మెరుగ్గా 8వ స్ధానంలో ఉంది. చైనాలో ఐటీ మేనేజర్కు లభిస్తున్న వార్షిక పారితోషికం 42,689 డాలర్లుగా నమోదైంది. ఐటీ ఉద్యోగుల జీతాలు తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇండియా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులకు ఆకర్షణీయ దేశంగా మారిందని నివేదిక పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications