మరింత భద్రత: మాస్టర్ కార్డ్ సెల్ఫీ టెక్నాలజీ (ఫోటోలు)
డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించాలంటే పాస్ వర్డ్ తప్పనిసరి. ఈ పాస్ వర్డ్ స్ధానంలో కొత్తగా టెక్నాలజీని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో చేసింది అమెరికాకన్ ఫైనాన్షియల్ కంపెనీ మాస్టర్ కార్డు.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డుకు మరింత భద్రత కలిగించేందుకు గాను సరికొత్త టెక్నాలజీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తేనుంది.
మాస్టర్ కార్డు చేసే ఈ ప్రయత్నం సఫలీకృతమైతే భవిష్యత్తులో ఒకరి అకౌంట్లోని నగదుని వేరే వ్యక్తులు తీసుకునే అవకాశం ఉండదని తెలిపింది. ఇంతకీ ఏంటా ఆ సరికొత్త టెక్నాలజీ అని అనుకుంటున్నారా?
మాస్టర్ కార్డ్ సెల్ఫీ టెక్నాలజీ
గతంలో అకౌంట్ వివరాలు తెలియజేయాలంటే అకౌంట్ నెంబర్, పాస్ వర్డ్ ఉండేవి, వాటి స్ధానంలో కొత్తగా సెల్ఫీని అందుబాటులోకి మాస్టర్ కార్డు సంస్ధ తీసుకురానుంది. ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్మయమైంది. ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది బ్యాంకింగ్ లావాదేవీలను మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నారు.
మాస్టర్ కార్డ్ సెల్ఫీ టెక్నాలజీ
ఈ కొత్త సెల్ఫీ టెక్నాలజీ ద్వారా మొబైల్ ద్వారా అన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు పాస్ వర్డ్ కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ అడగుతుంది. సెల్ఫీ ఆధారంగానే చెల్లింపులు, కొనుగోళ్లు జరగనున్నాయి.
మాస్టర్ కార్డ్ సెల్ఫీ టెక్నాలజీ
దీంతో పాస్ వర్డ్ మర్చిపోయినా వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఈ సెల్ఫీ టెక్నాలజీ ద్వారా ఎవరి అకౌంట్ను వారు మాత్రమే వియోగించేదుకు వీలుంది.
మాస్టర్ కార్డ్ సెల్ఫీ టెక్నాలజీ
ఈ వినూత్న ప్రయోగాన్ని మాస్టర్ కార్డు సంస్ధ 500 మంది వినియోగదారులతో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు మాస్టర్ కార్డు ఫోన్ యాప్ను డౌన్ లౌడ్ చేసుకోవాల్సి ఉంది.