సహారా ఆఫీసులపై ఐటీ దాడులు, రూ.135 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతో రాయ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ, నోయిడాల్లోని సంస్థ కార్యాలయాలపై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.135 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
నల్లధనంపై
విచారణ
జరుపుతున్న
ప్రత్యేక
దర్యాప్తు
బృందానికి
ఈ
విషయమై
నివేదిక
అందిచామన్నారు.
ఈ
విషయంపై
సహారా
గ్రూప్ను
సంప్రదించగా...
అంత
నగదు
కాదంటూనే,
ఆ
సొమ్ము
అంతా
చట్టబద్ధమైనదే
అని
తెలిపింది.
ఏడాది
కాలంగా
తమ
ఆస్తులపై
నిషేధాజ్ఞలు
ఉన్నాయని,
20
నెలలుగా
తమ
ఖాతాలన్నింటినీ
స్తంభింప
చేశారని,
వాటిల్లోని
నగదును
సెబీకి
చెల్లించినట్లు
సహారా
గ్రూప్
ప్రతినిధి
వెల్లడించారు.
అత్యవసరాల కోసం చట్టబద్దమైన నగదును వేరువేరు ప్రాంతాల్లో సహారా సంస్ధ నిల్వ ఉంచినట్లు తెలిపారు. సహారా కార్యాలయాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఆదాయపన్ను శాఖ ఈ దాడులు చేసింది.