For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడి రూ. 3,300 కోట్లు

By Nageswara Rao
|

FIIs pump in over Rs 3,300 cr in stocks in October so far
న్యూఢిల్లీ: విదేశీ సంస్దాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ)లు అక్టోబర్ నెలలో నిన్నటి వరకు స్టాక్ మార్కెట్లో రూ. 3,300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున ఎఫ్‌ఐఐ పెట్టుబడులు వస్తున్నాయి.

అక్టోబర్‌ 1-5 వరకు ఎఫ్‌ఐఐలు రూ.13,094 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. రూ.9,714 కోట్ల షేర్లు విక్రయించారు. దీంతో నికరంగా విదేశీ సంస్దాగత మదుపరులు మార్కెట్లో పెట్టుబడి పెట్టింది రూ.3,381 కోట్లుగా తెలింది. ఈ విషయాలను స్టాక్ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తెలియజేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్లో మొత్తం రూ.85,711 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటును పెంచే భాగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం వల్ల విదేశీ పెట్టుబడులు మరింత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

గత నెల ప్రభుత్వం రీటైల్ రంగంలో ఎఫ్‌డీఐలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించింది. బీమా రంగంలో కూడా విదేశీ పెట్టుబడుల వాటాను పెంచింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ బలపడింది. పెద్ద ఎత్తున స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందకు ముందకు వస్తున్నారు. ఈక్విటీ మార్కెట్‌తో పాటు ఎఫ్‌ఐఐలు రూ.1,382 కోట్లు బెడిట్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో స్టాక్‌ మార్కెట్‌ 176 పాయింట్లు పెరిగింది. ఎన్నడూ లేని విధంగా గత గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమవ్వడమే కాకుండా 19వేలకు పైగా ట్రేడ్ అయింది. 15 నెలల గరిష్ట స్దాయికి సెన్సెక్స్ చేరింది. డీజిల్‌ ధర పెంచడం, రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహం ఏర్పడింది. కొన్ని నిర్ణయాలతో సంస్కరణలు నిలిపేస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం భావిస్తున్నారు.

తెలుగు వన్ఇండియా

English summary

స్టాక్ మార్కెట్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడి రూ. 3,300 కోట్లు | FIIs pump in over Rs 3,300 cr in stocks in October so far | అక్టోబర్ నెలలో ఎఫ్‌ఐఐల పెట్టుబడి రూ. 3,300 కోట్లు

During October 1-5, foreign institutional investors were gross buyers of shares worth Rs 13,094 crore, while they sold equities amounting to Rs 9,714 crore translating into net inflow of Rs 3,381 crore (US $645 million), according to the data available with market regulator SEBI.
Story first published: Monday, October 8, 2012, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X