గత ఏడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా రూ. 19,000 కోట్ల పెట్టుబడులు
ఫిబ్రవరి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పెట్టుబడులు రాలేదు. గత ఫిబ్రవరిలో రూ. 25,2012 కోట్లు పెట్టుబడులు పెట్టగా... ఆగస్టులో రూ.10,804 కోట్లు జులైలో రూ.10,273 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్లో కేంద్రప్రభుత్వం పలు కీలకసంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపారు. ఇది ఇలా ఉంటే దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత మదుపర్లు(ఎఫ్ఐఐ) ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 11.2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఐఈ) తన మానిటరీ రివ్యూలో అంచనా వేసింది.
జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, డాయిష్ బ్యాంక్ వంటి భారీ ఎఫ్ఐఐ సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఇండియావైపు చూస్తున్నాయని పేర్కొంది. యూరోదేశాల రుణ సంక్షోభ పరిష్కారానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త ప్యాకేజీని ప్రకటించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. పూర్తి ఏడాదికి దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి రావచ్చనని అంచనా వేసింది.
తెలుగు వన్ఇండియా