న్యూఢిల్లీ: ఫిన్టెక్ సంస్థ పేటీఎం మంగళవారం వ్యాపారులకు శుభవార్త చెప్పింది. వ్యాపారులు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నింటి పైన ఛార్జీలను రద్దు చేసింది. పేటీఎం వ్యాలెట్, యూపీఐ యాప్స్, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్ పైన ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇది వ్యాపారులకు లాభం చేకూర్చి, వారి బిజినెస్ వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME)లకు తోడ్పడేందుకు బ్యాంకులు, ఇతర ఛార్జీలు ఏటా రూ.600 కోట్ల ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేసింది.

1.7 కోట్ల మంది వ్యాపారులకు ప్రయోజనం
పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ పీవోఎస్ ఉపయోగిస్తున్న దాదాపు 1.7 కోట్ల మంది వ్యాపారులకు తాజా నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఎండీఆర్ ఛార్జీల రద్దు ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇందుకు రూ.600 కోట్లు అవుతాయని, ఈ ఎండీఆర్ ఛార్జీల భారాన్ని పేటీఎం భరిస్తుందని తెలిపింది.

రూ.1000 కోట్ల రుణం
ఎండీఆర్ చార్జీల రద్దు నిర్ణయం డిజిటల్ ఇండియా మిషన్కు దోహదపడుతుందని పేటీఎం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు మార్చి 2021లోపు రూ.1000 కోట్ల రుణాలు అందించి అండగా ఉండాలని పేటీఎం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

పేమెంట్స్ ఆప్షన్ వారి ఇష్టం
అలాగే, పేమెంట్స్ను నేరుగా తమ పేటీఎం వ్యాలెట్కు లేదా తమ బ్యాంకు ఖాతాకు బదలీ చేసుకునే వెసులుబాటును కూడా వ్యాపారులకు కల్పిస్తున్నట్లు తెలిపింది పేటీఎం. పేటీఎం వ్యాలెట్, యూపీఐ, రూపే, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల వెసులుబాటు ఉంది. పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ జీరో ఛార్జీతో అపరిమిత చెల్లింపులను అంగీకరించేందుకు వ్యాపారులకు అవకాశం ఇస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications