For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిజిస్టర్ చేసుకుంటున్న వ్యాపారసంస్థలు, స్టార్టప్స్.. కానీ

|

కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో రూ.3 లక్షల కోట్లు హామీలేని రుణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారాలు, స్టార్టప్స్... మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEs)లు రిజిస్టర్ చేసుకుంటున్నాయి. అయితే ఈ అన్ని సంస్థలకు ప్రభుత్వ రిలీఫ్ ప్యాకేజీ ప్రయోజనం అందకపోవచ్చునని చెబుతున్నారు.

 తగ్గింది కరోనా కాదు, జీడీపీ: లాక్‌డౌన్‌పై రాజీవ్ బజాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు తగ్గింది కరోనా కాదు, జీడీపీ: లాక్‌డౌన్‌పై రాజీవ్ బజాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రుణాలు, ఇతర ప్రయోజనాలు

రుణాలు, ఇతర ప్రయోజనాలు

గత ఏడాది కాలంగా లిక్విడిటీ సమస్యతో ఇబ్బందులుపడుతున్న 4.5 మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రుణాలు అక్టోబర్ 31వ తేదీ వరకు ఇస్తారు. రూ.25 కోట్ల వరకు రుణాలు కలిగిన వ్యాపారలకు ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా స్టార్టప్స్, చిన్న వ్యాపారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ ఉద్యోగ్ ఆధార్ ద్వారా రుణాలు, ఇతర ప్రయోజనాలను పొందడానికి చాలా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ చూస్తున్నాయి.

బకాయిలు ఉన్న సంస్థలకు అర్హత

బకాయిలు ఉన్న సంస్థలకు అర్హత

స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు భారీగా ప్రయోజనాలు పొందాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ రుణ దృశ్యం అస్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అన్ని సంస్థలు రూణాలు పొందే పరిస్థితి లేదంటున్నారు. ఈ కొత్త రుణాలు అదనపు వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్‌గా పేర్కొంటున్నారు. ఈ రుణాలకు కంపెనీల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే వీటికి వంద శాతం ప్రభుత్వ గ్యారెంటీ ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వ ఎంఎస్ఎం ఈ వెబ్ సైట్ నుండి నమోదు చేయబడిందా లేదా అనే దాంతో సంబంధం లేదు. బకాయిలు ఉన్న సంస్థలకు అర్హత ఉంటుంది.

ప్రభుత్వ హామీ

ప్రభుత్వ హామీ

ఇటీవల 2,00,000 ఎంఎస్ఎంఈలకు రూ.20,000 కోట్ల రుణాలకు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ సంస్థలు ఒత్తిడిలో ఉన్నవి లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా ఉన్నాయి. ప్రభుత్వం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌కు రూ.4,000 కోట్లు పంపిణీ చేస్తుంది. మూడో పార్టీ గ్యారంటీ అవసరం లేకుండా బ్యాంకు లోన్ పొందుతాయి. అయితే ప్రభుత్వం రూ.20,000 కోట్లకు హామీ ఇస్తుంది.

వడ్డీ రేటు స్వల్పంగా...

వడ్డీ రేటు స్వల్పంగా...

ఎంఎస్ఎంఈ ప్రమోటర్లకు బ్యాంకులు యూనిట్ వాటాలో 15 శాతం సబార్డినేట్ రుణాలు అందిస్తాయని, ఈ రుణ మొత్తం రూ.75 లక్షల వరకు ఉంటుందని, వడ్డీ రేటు స్వల్పంగా ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఇవి కూడా కేవలం రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలకేనని, ఇప్పటికే ఆర్థిక ఒత్తిడికి లోనై, డిఫాల్ట్ ప్రమాదం ఉన్న వాటికి వర్తిస్తుందని చెబుతున్నారు.

English summary

రిజిస్టర్ చేసుకుంటున్న వ్యాపారసంస్థలు, స్టార్టప్స్.. కానీ | Most businesses, startups trying to register as MSMEs may not get loans

As small businesses and start-ups line up to register as micro, small and medium enterprises (MSMEs), most do not stand to benefit from the government’s relief package, say officials.
Story first published: Sunday, June 7, 2020, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X