న్యూఢిల్లీ: చెక్కు చెల్లింపుల కోసం జనవరి 1, 2021 నుండి కొత్త రూల్స్ అమలులోకి వస్తోన్న విషయం తెలిసిందే. పాజిటివ్ పేమెంట్ సిస్టంకు ఇప్పటికే ఆర్బీఐ ఆమోదం తెలిపింది. దీని కింద రూ.50,000కు పైగా ఉన్న చెక్కుల్ని అవసరమైన సమాచారం కోసం మళ్లీ నిర్ధారించనున్నారు. ఈ విధానంతో చెక్కు చెల్లింపులు మరింత సురక్షితమవుతాయి. చెక్కు చెల్లింపులు చేసేవారికి పాజిటివ్ పే సిట్టంను దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అమలు చేయనుంది.

బ్రాంచీని సంప్రదించవచ్చు
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జనవరి 2021 నుండి పాజిటివ్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తం చెక్ ద్వారా చెల్లింపులు చేసేవారు అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ జారీని చేసిన తేదీ, చెల్లింపుదారుని పేరు, మొదలైన వివరాలన తమకు తెలియజేయాలని ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. పాజిటివ్ పే సిస్టం ఎంపిక, సందేశాలు, సమస్యలు ఉంటే సమీపంలోని బ్యాంకు బ్రాంచీని సంప్రదించాలని ఎస్బీఐ సూచించింది.

మరోసారి ధృవీకరించుకోవడమే..
చెక్కులోని వివరాలను మరోసారి ధృవీకరించుకోవడమే పాజిటివ్ పే ముఖ్య ఉద్దేశ్యం. ఎక్కువ వ్యాల్యూతో కూడిన చెక్కును జారీ చేసినప్పుడు, చెక్కులో పేర్కొన్న తేదీ, లబ్దిదారుని పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, అమౌంట్ వంటి వివరాలు పాజిటివ్ పే వ్యవస్థ ద్వారా మరోసారి నిర్ధారణ చేసుకుంటారు. చెక్ జారీ చేసేవారు ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం మొదలైన ఛానల్స్ ద్వారా ఎలక్ట్రానిక్గా చెక్కులోని కనీస వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి.

క్రాస్ చెక్
వివరాలను సీటీఎస్ సమర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే అలాంటి చెక్కులను బ్యాంకు నిలిపివేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొని తమకు కావాల్సిన చిరునామాకు చెక్ బుక్ డెలివరీ కోసం అభ్యర్థించవచ్చునని ఎస్బీఐ ఇదివరకు తెలిపింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications