న్యూఢిల్లీ: చెక్కు చెల్లింపుల కోసం జనవరి 1, 2021 నుండి కొత్త రూల్స్ అమలులోకి వస్తోన్న విషయం తెలిసిందే. పాజిటివ్ పేమెంట్ సిస్టంకు ఇప్పటికే ఆర్బీఐ ఆమోదం తెలిపింది. దీని కింద రూ.50,000కు పైగా ఉన్న చెక్కుల్ని అవసరమైన సమాచారం కోసం మళ్లీ నిర్ధారించనున్నారు. ఈ విధానంతో చెక్కు చెల్లింపులు మరింత సురక్షితమవుతాయి. చెక్కు చెల్లింపులు చేసేవారికి పాజిటివ్ పే సిట్టంను దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అమలు చేయనుంది.

బ్రాంచీని సంప్రదించవచ్చు
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జనవరి 2021 నుండి పాజిటివ్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తం చెక్ ద్వారా చెల్లింపులు చేసేవారు అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ జారీని చేసిన తేదీ, చెల్లింపుదారుని పేరు, మొదలైన వివరాలన తమకు తెలియజేయాలని ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. పాజిటివ్ పే సిస్టం ఎంపిక, సందేశాలు, సమస్యలు ఉంటే సమీపంలోని బ్యాంకు బ్రాంచీని సంప్రదించాలని ఎస్బీఐ సూచించింది.

మరోసారి ధృవీకరించుకోవడమే..
చెక్కులోని వివరాలను మరోసారి ధృవీకరించుకోవడమే పాజిటివ్ పే ముఖ్య ఉద్దేశ్యం. ఎక్కువ వ్యాల్యూతో కూడిన చెక్కును జారీ చేసినప్పుడు, చెక్కులో పేర్కొన్న తేదీ, లబ్దిదారుని పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, అమౌంట్ వంటి వివరాలు పాజిటివ్ పే వ్యవస్థ ద్వారా మరోసారి నిర్ధారణ చేసుకుంటారు. చెక్ జారీ చేసేవారు ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం మొదలైన ఛానల్స్ ద్వారా ఎలక్ట్రానిక్గా చెక్కులోని కనీస వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి.

క్రాస్ చెక్
వివరాలను సీటీఎస్ సమర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే అలాంటి చెక్కులను బ్యాంకు నిలిపివేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొని తమకు కావాల్సిన చిరునామాకు చెక్ బుక్ డెలివరీ కోసం అభ్యర్థించవచ్చునని ఎస్బీఐ ఇదివరకు తెలిపింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications