జూలై 1, 2022 నాటికి మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే లేదా అనుసంధానం చేయకుంటే రెండింతల జరిమానా తప్పదు! ప్రభుత్వం ఆధార్ - పాన్ లింకింగ్కు పలుమార్లు గడువును పొడిగించింది. చివరిసారి జూలై 1వ తేదీ వరకు గడువును ఇచ్చింది. గడువులోగా (ఈ నెలాఖరు లోగా) ఆధార్ - పాన్ కార్డు లింక్ పూర్తి చేయకుంటే జరిమానాతో పాటు రూ.1000 చెల్లించాలి. ఈ నెలాఖరు వరకు ఆధార్ - పాన్ లింక్ అనుసంధానంపై రూ.500 చెల్లించాలి. గడువులోగా పాన్-ఆధార్ పూర్తి చేయకుంటే ఆధార్ ఇన్-ఆఫరేటవ్ అవుతుంది. ఐటీ శాఖ పోర్టల్లోకి వెళ్లి మీరు సులభంగా ఆధార్-పాన్ లింక్ చేయవచ్చు.
లింక్ అయిందా చెక్ చేయండి ఇలా
-incometaxindiaefiling.gov.in/aadhaarstatus వెబ్ సైట్లోకి లాగ్-ఇన్ కావాలి.

- పాన్, ఆధార్ వివరాలు నింపాలి.
- View Link Aadhaar Status ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- తదుపరి స్క్రీన్లో చెక్ లింకింగ్ స్టేటస్ ఉంటుంది.
లింక్ చేయండి ఇలా
- www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Quick Links సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
- Link Aadhaar ఆధార్ పైన క్లిక్ చేయాలి.
- పాన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇతర వివరాలు నింపాలి.
- స్క్రీన్ పైన కనిపించే కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- Link Aadhaar ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
ఎస్సెమ్మెస్ ద్వారా...
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 567678 లేదా 567678కు మీ ఆధార్ నెంబర్ను ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లింక్ చేయవచ్చు. ఫార్మాట్ ఇది.... UIDPAN


Click it and Unblock the Notifications