ఈ నెలాఖరులోగా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే డబుల్ ఫైన్
జూలై 1, 2022 నాటికి మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే లేదా అనుసంధానం చేయకుంటే రెండింతల జరిమానా తప్పదు! ప్రభుత్వం ఆధార్ - పాన్ లింకింగ్కు పలుమార్లు గడువును పొడిగించింది. చివరిసారి జూలై 1వ తేదీ వరకు గడువును ఇచ్చింది. గడువులోగా (ఈ నెలాఖరు లోగా) ఆధార్ - పాన్ కార్డు లింక్ పూర్తి చేయకుంటే జరిమానాతో పాటు రూ.1000 చెల్లించాలి. ఈ నెలాఖరు వరకు ఆధార్ - పాన్ లింక్ అనుసంధానంపై రూ.500 చెల్లించాలి. గడువులోగా పాన్-ఆధార్ పూర్తి చేయకుంటే ఆధార్ ఇన్-ఆఫరేటవ్ అవుతుంది. ఐటీ శాఖ పోర్టల్లోకి వెళ్లి మీరు సులభంగా ఆధార్-పాన్ లింక్ చేయవచ్చు.
లింక్ అయిందా చెక్ చేయండి ఇలా
-incometaxindiaefiling.gov.in/aadhaarstatus వెబ్ సైట్లోకి లాగ్-ఇన్ కావాలి.
- పాన్, ఆధార్ వివరాలు నింపాలి.
- View Link Aadhaar Status ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- తదుపరి స్క్రీన్లో చెక్ లింకింగ్ స్టేటస్ ఉంటుంది.
లింక్ చేయండి ఇలా
-
www.incometaxindiaefiling.gov.in
వెబ్
సైట్
లోకి
వెళ్లాలి.
-
Quick
Links
సెక్షన్
పైన
క్లిక్
చేయాలి.
-
Link
Aadhaar
ఆధార్
పైన
క్లిక్
చేయాలి.
-
పాన్,
ఆధార్
నెంబర్
ఎంటర్
చేయాలి.
ఇతర
వివరాలు
నింపాలి.
-
స్క్రీన్
పైన
కనిపించే
కాప్చా
కోడ్
ఎంటర్
చేయాలి.
-
Link
Aadhaar
ట్యాబ్
పైన
క్లిక్
చేయాలి.
ఎస్సెమ్మెస్ ద్వారా...
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 567678 లేదా 567678కు మీ ఆధార్ నెంబర్ను ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లింక్ చేయవచ్చు. ఫార్మాట్ ఇది.... UIDPAN