అసలు పెట్రోల్ ధరలు ఇంత విపరీతంగా పెరగడానికి కారణాలు ఇవేనా?
ఢిల్లీ, కోల్కతా, ముంబయి, చెన్నైలలో పెట్రోల్ ధరలు లీటరు పై 29-32 పైసలు పెరిగాయి.ఈ వరుస ధరలు పెరగడానికి గల కారణం కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజులు దరల విషయంలో విరామం ఇవ్వడమే ప్రధాన కారణం అంటున్నారు.
ఢిల్లీ, కోల్కతా, ముంబయి, చెన్నైలలో పెట్రోల్ ధరలు లీటరు పై 29-32 పైసలు పెరిగాయి.
ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో వరుసగా తొమ్మిదవ రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ వరుస ధరలు పెరగడానికి గల కారణం కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజులు దరల విషయంలో విరామం ఇవ్వడమే ప్రధాన కారణం అంటున్నారు. పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.2.24 రూపాయలు,కోల్కతాలో లీటరుకు రూ. 2.21, లీటరు ముంబై రూ. 2.22 మరియు ఈ 9 రోజుల కాలంలో చెన్నైలో లీటరుకు రూ.2.36 చొప్పున ధరలు పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. డీజిల్ ధరలు రూ. 2.15 లీటరు, రూ. 2 లీటర్, రూ. 2.28 లీటరు, రూ.2.31 వరుసగా పెరుగుతూ వచ్చాయి.
పెట్రోలు మరియు డీజిల్ ధరలు పెరగడానికి గల ఐదు ప్రధాన కారణాలు కింద చూడండి:
1. మంగళవారం పెట్రోలు ధరలు
మంగళవారం, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో లీటరుకు 29-32 పైసలు పెట్రోలు ధరలు పెరిగాయి. డీజిల్ ధర లీటరుకు 26-28 పైసలు పెరిగాయి,నిన్నటి రోజుతో పోల్చి చూస్తే.మంగళవారం ఉదయం 6 గంటలకు పెట్రోల్ లీటరు ఢిల్లీలో రూ.76.87 రూపాయలు. కోల్కతాలో రూ.79.53 రూపాయలు. ముంబైలో రూ.84.7, రూ. 79.79 చెన్నైలో ధరలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ ప్రకటించింది.
2.డీజిల్ ధరలు
డీజిల్ ఢిల్లీలో లీటరుకు రూ.68.08 రూపాయలు,కోల్కతాలో రూ. 70.63 ,ముంబయిలో లీటరుకు రూ72.48 రూపాయలు, . చెన్నైలో లీటరుకు రూ71.87 చొప్పున ఉంది. ఎప్పటి దాక పెట్రోల్ పై పెరిగిన ధరలు సుమారు ఒక లీటర్ కు రూ.6.81-7.26 పెరిగినట్టు నాలుగు ప్రధాన మెట్రో ప్రాంతాలు తేల్చి చేప్పాయి. డీజిల్ ధరల పెంపు పెరుగుతున్న ప్రపంచ ముడి ధరల నేపథ్యంలో లీటరుకు రూ.8.33-9.21 నమోదయ్యాయి.
3.ముడి చమురు ధరల
గత కొన్ని నెలలుగా ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్కు వ్యతిరేకంగా రూపాయి బలహీనతతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు ఢిల్లీ, ముంబయిలలో పలు కారణాల వల్ల విపరీతంగా పెరిగిపోయాయి.
4.చమురు శాఖ మంత్రి
4.చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం మాట్లాడుతూ, ఇంధన ధరలు పెరుగుతున్నందున,వివిధ ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం," అని ప్రధాన్ చెప్పారు, త్వరలో పరిష్కారం ఆలోచిస్తాం అని పేర్కొన్నారు.
5. పెట్రోలియం ఎగుమతి
5. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒఇసిఇసి) నేతృత్వంలో కొనసాగుతున్న ఉత్పత్తి కోతలు 2014 చివరి నాటి నుండి ముడి చమురు ధరలు తమ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ జూన్ నెలలో మొదటిసారిగా బ్యారెల్కు 80 డాలర్లుగా విక్రయించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ దాదాపు 6 శాతం బలహీనపడింది.