ద్రవ్యోల్బణ రాహిత్యం అంటే ఏమిటి?
సాధారణంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్న సమయంలో కేంద్ర బ్యాంకు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రంచేందుకు తగిన చర్యలు చేపడుతుంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ విధానాలను అనుసరించి ద్రవ్యోల్బణ కట్టడికి పూనుకుంటుంది. ఇలాంటి సమయాల్లో కేంద్రం బ్యాంకు కీలకమైన రెపో రేటు(బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు)ను పెంచే అవకాశం కూడా ఉంటుంది.
ఈ వడ్డీ రేటు పెంపు మార్కెట్లలో నిధుల ప్రవాహంపై ప్రభావితం చూపుతుంది. తక్కువ డిమాండ్ వల్ల ఆర్థిక వ్యవస్థలో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కేంద్ర బ్యాంకు చేపట్టిన ఈ చర్య వల్ల ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రాహిత్యం ప్రభావం ఏర్పడుతుంది.
ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ రాహిత్యం ప్రభావం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇదే సమయంలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా జరిగినట్లయితే కేంద్ర బ్యాంకు తన వడ్డీ రేటును తగ్గించుకుని ధరల స్థాయిని స్థిరంగా ఉంచే విధంగా చర్యలను చేపడుతుంది. ఈ విధంగా ధరల పెరుగల లేదా తగ్గుదలలు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావం చేయడంతోపాటు కేంద్ర బ్యాంకు విధానాన్ని చేపట్టేందుకు కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది.