తమ కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మీరు ఏటీఎం సెంటర్కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లేదా మినీ స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ మీకు ఓ ఎస్సెమ్మెస్ను పంపిస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఎస్బీఐ ఈ కొత్త ఫీచర్ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ ఫ్రాడ్స్ పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్మెంట్కు సంబంధించి ఎస్సెమ్మెస్ హెచ్చరికలను విస్మరించవద్దని సూచించింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఈ ఎస్సెమ్మెస్ వస్తుంది.

వెంటనే ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకోవచ్చు..
ఏటీఎమ్ నుండి బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ తీసుకున్న ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓ సందేశం పంపించడం ద్వారా ఖాతాదారులను అలర్ట్ చేయడం ద్వారా కస్టమర్ ఖాతాలు సురక్షితంగా ఉంటాయి. ఈ మెసేజ్ అలర్ట్ కారణంగా ఒకవేళ అనధికార ట్రాన్సాక్షన్స్ జరిగితే కనుక సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది.

మీ తెలివితో...
ఇప్పుడు ఏటీఎం ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్మెంట్ కోసం ఒక అభ్యర్థనను స్వీకరించినప్పుడు, మేము(ఎస్బీఐ) మా కస్టమర్లను ఒక ఎస్సెమ్మెస్ పంపించి అలర్ట్ చేస్తామని, ఆ ట్రాన్సాక్షన్ వారిది కాకపోతే వారు వెంటనే వారి డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చునని ట్వీట్లో పేర్కొంది. కస్టమర్ల భద్రతా వ్యవస్థలో కొంత లొసుగుల కోసం వెతుకుతున్న మోసగాళ్ళను గుర్తించడానికి మీ తెలివిని ఉపయోగించండని, కొన్ని భద్రతా చిట్కాలు ఉన్నాయి తెలిపింది.

ఇలా చేయండి..
ఫ్రాడ్స్టర్స్కు ఇలా కొత్త కొత్త పద్ధతుల్లో చీట్ చేస్తారని చెబుతూ వీడియోను రూపొందించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీనిని ఉపయోగించుకొని చీట్ చేయవచ్చునని తెలిపింది. తాము ప్రభుత్వం లేదా చారిటీ ట్రస్ట్స్ లేదా రిలీఫ్ ఫండ్కు చెందిన వారమని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తారని, కరోనా ట్రీట్మెంట్కు రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని కోరుతారని, సైబర్ నేరగాళ్లు ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఈమెయిల్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాం ద్వారా నమ్మించే ప్రయత్నాలు చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇలా వచ్చినప్పుడు సైబర్ నేరగాళ్లను, అసలైన వారిని గుర్తించడం ఇబ్బందికరంగా మారుతుందని, అయినప్పటికీ మీ వ్యక్తిగత విషయాలు తెలియని వ్యక్తులకు అసలు షేర్ చేయవద్దని సూచించింది. మీ పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చుకోవడం మంచిదని తెలిపింది. ఫోన్ లేదా మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చే వారితో మీ బ్యాంకు డిటైల్స్ షేర్ చేయవద్దని సూచించింది. అలాంటి అనుమానిత లింక్స్ పైన క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. ఎస్బీఐకి సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు అధికారిక వెబ్ సైట్ను చూడాలని, సైబర్ నేరగాళ్లను గుర్తిస్తే దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచీలో అధికారులకు తెలియజేయాలని సూచించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications