స్మాల్ స్కేల్, మీడియం వ్యాపారుల(MSMB) కోసం రిలయన్స్ జియో ఇటీవల సరికొత్త టారిఫ్ ప్లాన్ను ఆవిష్కరించింది. బ్రాడ్ బాండ్, వాయిస్ కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్, ఇతర డిజిటల్ సొల్యూషన్స్తో ఈ ప్లాన్స్ను అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తోన్న ఇతర టెలికం సంస్థల ప్లాన్స్తో పోలిస్తే తమ ప్లాన్ ధరలు పదో వంతు మాత్రమేనని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.

భారీ సంస్థలకు ధీటుగా
మొత్తం ఏడు రకాల ప్లాన్స్ను జియో పరిచయం చేసింది. భాగస్వాములతో కలిసి జియో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ సులువైన డిజిటల్ సొల్యూషన్స్ను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల MSMBలకు ఈ ప్లాన్స్ చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతోన్న నేపథ్యంలో భారీ సంస్థలకు ధీటుగా చిన్న వ్యాపారులు నిలదొక్కుకునేందుకు ఈ ప్లాన్స్ దోహదం చేస్తాయని జియో తెలిపింది.

వారి ఖర్చులో పదోవంతు
సెకనుకు 100Mbps అప్ లోడ్, డౌన్ లోడ్ సామర్థ్యంతో అన్లిమిటెడ్ వినియోగ అవకాశం గల ప్లాన్ రూ.901కి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం MSMBలు కనెక్టివిటీ, ప్రోడక్టివిటీ, ఆటోమేషన్ పరికరాల పైన నెలకు రూ.15,000 నుండి రూ.20,000 వరకు ఖర్చు చేస్తున్నాయని, వారికి మార్కెట్ ధర కంటే పదిశాతం తక్కువకు సేవలు అందుబాటులోకి తెస్తున్నామని జియో తెలిపింది.

ప్లాన్స్ ఇవీ...
ప్రారంభ ధర నెలకు రూ.901. ఇందులో అపరిమిత బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ ఉంటుంది. దేశంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునేందుకు ఓ ఫోన్ కనెక్షన్ ఇస్తారు. ప్లాన్ గరిష్ట ధర రూ.10,001. సెకన్కు 1 గిగా బైట్ స్పీడ్తో బ్రాడ్ బాండ్, 8 లైన్ల వాయిస్ కాల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్, జియోమీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇతర డివైజెస్ కోసం 25 లైసెన్స్ ఉంటాయి. రూ.901, రూ.10,0001 ప్లాన్లతో పాటు రూ.1,201, రూ.2,001, రూ.3,001, రూ.5,001, రూ.7,001 ప్లాన్స్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications