ఈ కార్డుతో ఉచితంగా లేదా తక్కువ ధరకే రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు!
ఇండియన్ రైల్వే ప్రయాణీకులు రివార్డ్ పాయింట్స్ ద్వారా ఉచితంగా లేదా తక్కువ ధరకే ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు! మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డు-ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కొద్ది నెలల క్రితం ప్రారంభించింది.
కొత్త ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డు మరింత సౌకర్యవంతంగా, వేగంగా, సురక్షితం. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కలిగి ఉంది. IRCTC SBI రూపే కార్డు ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ కొన్ని తెలుసుకోండి....
ట్యాక్స్పేయర్స్కు ఊరట, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
ఎక్స్క్లూజివ్ ఫీచర్స్
31 మార్చి 2021 వరకు ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు.
IRCTC వెబ్ పోర్టల్ ద్వారా రైల్వే టిక్కెట్స్ బుక్ చేసుకుంటే 10 శాతం వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. (ఒక రివార్డు పాయింట్ = ఒక రూపాయి)
యూజర్లు రివార్డ్ పాయింట్స్ ద్వారా ఉచితంగా టిక్కెట్లను రిడీమ్ చేసుకోవచ్చు. తమకు లేదా కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు వినియోగించవచ్చు.
మొదటి 45 రోజుల్లో రూ.500 ట్రాన్సాక్షన్ పైన యుజర్లు 350 బోనస్ రివార్డ్ పాయింట్స్ పొందుతారు.
IRCTC వెబ్ సైట్ ద్వారా రైలు టిక్కెట్లుబుక్ చేస్తే 1 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీ రద్దు ఉంటుంది.
కాంప్లిమెంటరీ ప్రీమియం రైల్వే లాంజ్ యాక్సెస్ను అందిస్తుంది. (క్వార్టర్కు ఒక విజిట్)
అన్ని పెట్రోల్ బంకుల్లో 1 శాతం ఫ్యూయల్ సర్ఛార్జీ మాఫీ ఉంటుంది.
కాంటాక్ట్లెస్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) ఫీచర్ ఉంది. మెట్రో, టోల్, ప్లాట్ఫాం టిక్కెట్ కోసం ట్యాప్ అండ్ గో పేమెంట్స్ కోసం వాలెట్ ఫీచర్స్. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.
షాపింగ్ ప్రయోజనాలు
IRCTC SBI రూపే కార్డ్ ఆన్లైన్ దుకాణదారులకు వివిధ ప్రయోజనాలు అందిస్తోంది. వినియోగదారులు మెడ్ లైఫ్, ఫిటెర్నిటీ, మీ ఎన్ మామ్స్ మొదలైన వాటిపై డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈ కార్డు వినియోగదారులకు పాథాలజీపై 40 శాతం తగ్గింపు, 1ఎంజీ నుండి మెడిసిన్స్ కొనుగోలుపై 18 శాతం తగ్గింపు, అప్గ్రేడ్ కోర్సు పైన 10 శాతం ఫీజు రద్దు, దిమ్యాన్ కంపెనీలో షాపింగ్ పైన రూ.250 తగ్గింపు, అపోలో ఫార్మసీ, మమెర్త్ ఫార్మసీలో 10 శాతం చొప్పున డిస్కౌంట్ ఉంది.
ప్రయాణాలు ఇప్పుడిప్పుడే..
కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి వరకు ప్రయాణాలు నిలిచిపోయాయి. ఇప్పటికి అవసరమైతే తప్ప ప్రయాణాలు దాదాపు తగ్గిపోయాయి. రైలు ప్రయాణం చేసేవారు చాలామంది IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు ఉచితంగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రివార్డు పాయింట్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.