రైళ్లలో దూరం ప్రయాణిస్తున్నారా?: సూపర్ ఆఫర్.. రూ.50 శాతం డిస్కౌంట్!
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా యువతకు భారతీయ రైల్వే టిక్కెట్ పైన 50 శాతం గ్రాంట్ ఇస్తోంది. ఈ తగ్గింపు అవకాశం కేవలం యువతకు మాత్రమే ఇస్తోంది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్లలో ప్యాణించే వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి.
అమెరికా చేతిలో ఇరాన్ టాప్ కమాండర్ హతం, పెరిగిన చమురు ధరలు
వీరికి 50 శాతం తగ్గింపు
- రైల్వే టిక్కెట్లపై 50 శాతం తగ్గింపు పొందేందుకు నెలకు ఆదాయం రూ.5,000 లోపు ఉండాలి.
- ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణిస్తే ఈ టిక్కెట్ తగ్గింపు వర్తిస్తుంది.
- తగ్గింపు సాధారణ రైళ్ల సర్వీసులకు వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్లకు వర్తించదు.
బేసిక్ ధరకే తగ్గింపు
- ప్రయాణీకులు వెళ్లీ కనీస దూరం 300 కిలో మీటర్లు ఉండాలి.
- మెయిల్, ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలోని సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టిక్కెట్లకు ఈ స్కీం వర్తిస్తుంది.
- బేసిక్ ఫేర్కే ఈ 50 శాతం తగ్గింపు వర్తిస్తుంది.
- రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర సప్లిమెంటరీ ఛార్జీలకు వర్తించదు.
- ఆయా రాష్ట్రాల హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెక్రటరీ నుంచి పొందిన ధృవీకరణ పత్రం ఆధారంగా రాయితీ ఉంటుంది.
వీరికి ఆఫర్ వర్తించదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయ ఖర్చులతో ప్రయాణం చేసేవారికి మాత్రం డిస్కౌంట్ వర్తించదు.